కరోనా వైరస్ బయోవెపన్ కాదు -అమెరికా ఇంటలిజెన్స్

కరోనా వైరస్ ను చైనా ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసిన జీవాయుధం అని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం (unscientific) అని అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్ధలు నిర్ధారించాయి. కరోనా వైరస్ జీవాయుధం అని చెప్పేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, అటువంటి వాదనలు శాస్త్రీయ పరీక్షలకు నిలబడవని అమెరికా ఇంటలిజెన్స్ ఏజన్సీలు స్పష్టం చేశాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా గూఢచార ఏజన్సీలు పరిశోధన చేసి నివేదిక సమర్పించాయి. సదరు నివేదిక సారాంశాన్ని గత…

ఉత్తరఖండ్ వరదలు: పాఠాలు నేర్చేదే లేదు!

ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి  52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల…

గోవా బి‌జే‌పి అవినీతి: 88 మైనింగ్ కాంట్రాక్టులు రద్దు చేసిన కోర్టు

కాంగ్రెస్ పార్టీ అవినీతికి రారాజు అని బి‌జే‌పి నేతలు తిట్టి పోస్తారు. ఎన్నడూ నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడన్నా నోరు తెరిస్తే మాత్రం కాంగ్రెస్ అవినీతి గురించీ, అనువంశిక పాలన గురించీ విమర్శించకుండా ఉండడు. కానీ కాంగ్రెస్ అవినీతిని కొనసాగించడానికి మాత్రం బి‌జే‌పికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. గోవా బి‌జే‌పి ప్రభుత్వం రెన్యూవల్ చేసిన 88 మైనింగ్ లీజులు అక్రమం అని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ధారించింది. లీజులను రద్దు చేస్తూ ఈ రోజు…

జపాన్ తో అణు ఒప్పందం -ద హిందూ..

  పౌర అణు సహకారం నిమిత్తం ఇండియా 11 దేశాలతో -అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాలతో సహా- ఒప్పందాలు చేసుకుంది. కానీ త్వరలో జపాన్ తో జరగనున్న ఒప్పందం పరిగణించదగినది. అణు దాడికి గురయిన ఏకైక దేశం జపాన్; కనుక అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం (NPT ) పైన సంతకం చేయని ఇండియాతో అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఆ దేశం నిర్ణయించడం తనకు మొదటిది అవుతుంది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్…

ఎల్ నినో: ఈ జులై, చరిత్రలో అత్యధిక వేడిమి నెల

ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరి నుండి 2016 సంవత్సరం లోని జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించిందని అమెరికా ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 137 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని, ఇన్నేళ్లలో ఈ యేటి జులైలో ప్రపంచ వ్యాపితంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వారు తెలిపారు. యే సంవత్సరం తీసుకున్నా, జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం రివాజు అని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్!

“మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రపంచం ఇండియావైపు ఎందుకు చూడాలి?” యమునా తీరాన్ని ఖరాబు చేసే పనిలో నిమగ్నం అయిన పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ కు మద్దతు వస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అడిగిన ప్రశ్న ఇది. [పండిట్ బిరుదు ఆయనకు గతంలో ఉండేది. తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. అందుకే రాసి కొట్టివేయడం.] మూడు రోజుల పాటు జరగనున్న ‘ప్రపంచ సాంస్కృతి పండగ’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ఢిల్లీలో ప్రారంభిస్తూ…

ఢిల్లీ కాలుష్యం: బేసి-సరి పధకం విజయవంతం! -ఫోటోలు

బి.జె.పి నేతల శాపనార్ధాలను వమ్ము చేస్తూ ఢిల్లీలో బేసి-సరి పధకం విజయవంతం అయింది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన రీతిలో తమ పధకానికి స్పందించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ దారి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాదని ప్రజలే దానిని సొంతం చేసుకున్నారని ప్రభుత్వం వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కలుషిత గాలి కలిగిన నగరంగా…

చెన్నై జల విలయం -ఫోటోలు

జల విలయం అన్నది చిన్నమాట కావచ్చు. ఏకంగా ఫ్లై ఓవర్ రోడ్లే నిండా మునిగిపోయే వర్షం! ది హిందు ప్రకారం మునిగిపోయిన రోడ్ల సంఖ్య 6,857. 84 గంటల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకి తడవని వాడు వెధవ కిందే లెక్క! వంద యేళ్ళ తర్వాత ఈ స్ధాయిలో కురిసిన వర్షాన్ని కనీసం స్పర్శతోనన్నా అనుభవించనివాడు వెధవ కాక మరెవ్వరూ? నీటి కొరతతో సంవత్సరం పొడవునా అల్లాడుతూ గడిపే చెన్నై నగరాన్ని రాక రాక వచ్చి పలకరించిన…

చెన్నైపై లంగరు వేసిన అల్ప పీడనం -కార్టూన్

నవంబర్ 8 తేదీ నుండి కురుస్తున్న వర్షాలు చెన్నై నగరాన్ని ముంచివేసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడి చేసిన రెండు అల్ప పీడనాలు ఈ వర్షాలకు కారణం. అల్ప పీడనాలు కొత్తేమీ కాదు. అల్ప పీడనాలు ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తరహాలో ఊహించని రీతిలో వర్షపాతం ఇచ్చే అల్ప పీడనాలే కొత్త. ఎల్-నినో పుణ్యమా అని ఈ యేడు నైరుతి ఋతుపవనాలు పెద్దగా వర్షాలను ఇవ్వలేదు. దేశం మొత్తం మీద…

ఋతుపవనాలు: ఈ యేడూ కష్టమే

ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది.  93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది. తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన…

ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు. మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు…

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

(నేపాల్) విపత్తు సమయంలో మైకులు -ది హిందు ఎడిట్..

(Mikes in the time of disaster శీర్షికన ఈ రోజు -మే 8- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) ********** “If it bleeds, it leads” (వివరణకు ఆర్టికల్ చివర చూడండి.) అని న్యూస్ రూమ్ లో ఒక వాడుక. దురదృష్టవశాత్తూ, ఇది మీడియా సంస్ధలకు ఉండవలసిన మర్యాద, సభ్యత, నైతికతల నుండి వడకట్టబడి కూడా బైటకువస్తున్న సంగతిని భారతీయ ప్రసార జర్నలిజం దాదాపు క్రమం తప్పకుండా విస్మరిస్తోంది.…

నేపాల్: యూరోపియన్లు కనపడుటలేదు

నేపాల్ భూకంపం ఒక్క నేపాల్ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా అనేకమందికి విషాధాన్ని మిగిల్చింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన 1000 మంది వరకు కనిపించకుండా పోయారని యూరోపియన్ యూనియన్ అధికారులు తెలిపారు. పర్వతారోహకులకు హిమాలయ పర్వతాలు ఆకర్షణీయం కావడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. 1000 మంది వరకూ ఆచూకీ తెలియకుండా పోగా 12 మంది మరణించినట్లు ధృవపడిందని నేపాల్ సందర్శించిన ఈ.యు బృందం తెలిపింది. “వాళ్ళు ఎక్కడ ఉన్నదీ తెలియదు. కనీసం ఎక్కడ…

నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు

నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇటీవలి వరకూ కొనసాగిన శతాబ్దాల నాటి భూస్వామ్య రాచరిక పాలన దేశ సంపదలను కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకరింపజేయడంతో ఇప్పుడది ప్రకృతి విలయానంతర రక్షణ ఏర్పాట్లు చేయడంలో కూడా ఘోరంగా విఫలం అవుతోంది. సంపన్న కుటుంబాలు ప్రభుత్వాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టడంతో రక్షణ పరికరాలు కొరవడి, తగిన శిక్షణ లేని భద్రతా సిబ్బంది తెల్లమొఖం వేయడంతో జనమే పూనుకుని తమ ఏర్పాట్లు తాము…