డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జి‌డి‌పి

2016-17 సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి గణనీయంగా పడిపోయింది. 8 శాతం పైగా నమోదు చేస్తుందని ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం, ఆర్‌బి‌ఐ, ఆర్ధిక సలహాదారులు అంచనా వేయగా 7 శాతం మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు తెలిపాయి. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్ధిక వృద్ధి రేటు పడిపోతుందన్న పలువురు నిపుణుల అంచనాలు నిజం కాగా ప్రభావం పెద్దగా ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తప్పింది. గడచిన ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో (జనవరి…

ట్రంప్ అమెరికా: పరవళ్ళు తొక్కుతున్న యుద్ధోన్మాదం -1

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు మంగళం పాడాడు. మధ్య ప్రాచ్యం (ముఖ్యంగా సిరియా), ఇరాన్, చైనా, లాటిన్ అమెరికా, రష్యా, లిబియా, యెమెన్, ఆర్ధిక రంగం… ఇలా అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ ఆయన తన ఎన్నికల హామీలకు విరుద్ధంగా చర్యలు చేపడుతున్నాడు. ఆయన వాగ్దానాలను నమ్మి యుద్ధ వాతావరణం ఎంతో కొంత ఉపశమిస్తుందని ఆశించిన విశ్లేషకులు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నారు. అమెరికా పాలకవర్గాలలోని గ్రూపుల మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణలో ట్రంప్…

బ్రెగ్జిట్: ఎగువ సభలో ధెరెసా పాక్షిక ఓటమి -విశ్లేషణ

బ్రిటిష్ ప్రధాని ధెరెసా ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) లో పాక్షిక ఓటమిని ఎదుర్కొన్నారు. ప్రధాని ప్రతిపాదించిన బ్రెగ్జిట్ బిల్లు దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) లో యధాతధంగా ఆమోదం పొందగా ఎగువ సభలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన సవరణతో ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తీర్పు అమలు చేసే విషయంలో ఆమె రచించిన పధకానికి ఈ ఓటమి వల్ల ఆటంకాలు ఎదురుకానున్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం ఆలస్యం కావచ్చు. లార్డ్స్ సభలో బ్రెగ్జిట్…

ఏ‌టి‌ఎంలలో ఫేక్ 2000 నోట్లు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు అట్టహాసంగా ప్రకటించిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదని రుజువు చేసే ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రైవేటు బ్యాంకుల ఏ‌టి‌ఎంలతో పాటు ఇటు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం దొంగ నోట్లు పంపిణీ చేస్తూ ప్రధానినీ, డీమానిటైజేషన్ సమర్ధకులనూ, కాషాయ పరివార గణాన్నీ అపహాస్యం చేస్తున్నాయి. హర్యానాలో కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు…

గిరాకీ కోల్పోతున్న అమెరికా బాండ్లు -విశ్లేషణ

అమెరికా ఆర్ధిక పరపతి క్షీణిస్తున్న నేపధ్యంలో అమెరికా ఋణ పెట్టుబడులకు గిరాకీ తగ్గిపోతున్నది. అంటే అమెరికాకి అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్లు తగ్గిపోతున్నారు. ఋణ పరపతి తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. మార్కెట్ ఎకానమీ ఆర్ధిక వ్యవస్ధలు అప్పులపై ఆధారపడి రోజువారీ కార్యకలాపాలు నడిపిస్తుంటాయి. అప్పులు తెచ్చి ఖర్చు చేస్తూ ఆ తర్వాత పన్నుల ఆదాయంతో అప్పులు తీర్చుతుంటాయి. అప్పు ఇచ్చేవాళ్లు లేకపోవడం అంటే దేశ ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యంపై నమ్మకం క్షీణిస్తున్నట్లు అర్ధం. సార్వభౌమ…

నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ

నిపుణులు హెచ్చరించినట్లగానే, డీమానిటైజేషన్ కష్టాలు ప్రజలని ఇంకా వదలలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో (జనవరి వేతనాల కోసం) ఉద్యోగులు, మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులు డబ్బు డ్రా చేశారు. దానితో బ్యాంకుల వద్ద కరెన్సీ నోట్లు నిండుకున్నాయి. ఎటిఎం లలో ఉంచేందుకు బ్యాంకుల వద్ద ఇక డబ్బు లేకపోవడంతో దేశంలో నాలుగో వంతు ఎటిఎం లు ఖాళీ అయిపోయాయి. ‘నో క్యాష్’ బోర్డులు అనేక ఎటిఎం ల ముందు వెక్కిరిస్తున్నాయి.  ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ…

పేదల కోసమే! -మోడీ కొత్త పాట

మొదట బ్లాక్ మనీ-ఉగ్రవాదం-దొంగ నోట్లపై పోరాటం అన్నారు; ఆ తర్వాత మారక వ్యవస్ధను డిజిటైజ్ చేయడమే లక్ష్యం అన్నారు’ ఇప్పుడు “పేద జనోద్ధరణ కోసమే” అంటున్నారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.  మంగళవారం లోక్ సభలో తన డీమానిటైజేషన్ చర్యను సమర్ధించుకున్న ప్రధాన మంత్రి “ఇది పేదల తరపున చేస్తున్న పోరాటంలో భాగమే” అని సెలవిచ్చారు. “ఇండియాను శుభ్రం చేసేందుకు డీమానిటైజేషన్ కు నిర్ణయించాము. పేదల అభ్యున్నతికే నేను చేసే పోరాటం. పేదలకు రావలసింది దక్కడం కోసం…

ట్రంప్ వీసా బిల్లులు, భారతీయుల ఉపాధి -విశ్లేషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాపులర్ వాగ్దానాలను శరవేగంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుండి వలసలను మూడు నెలల పాటు నిషేధించి ప్రపంచ వ్యాపితంగా కాక పుట్టించిన ట్రంప్, ఇప్పుడు ఉద్యోగాల సంరక్షణ పనిలో పడ్డాడు. అమెరికా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (కాంగ్రెస్) లో ఇద్దరు సభ్యులు ఈ మేరకు రెండు వేరు వేరు బిల్లులు ప్రవేశపెట్టారు. అవి రెండూ విదేశీయులకు వీసాలు, ఉద్యోగాలు…

నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జి‌డి‌పి వృద్ధి రేటు అంచనాను ఐ‌ఎం‌ఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐ‌ఎం‌ఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది. “ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి…

1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

నోట్ల రద్దు: వివరాలు చెబితే ప్రాణాలకు ముప్పు -ఉర్జిత్

పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.  నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను…

నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు

పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా…

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! -సాక్షి

  ఇది సాక్షి దిన పత్రికలో ఈ రోజు, జనవరి 9, 2017 తేదీన ప్రచురితం అయిన కధనం. నిన్న ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కధనం ఉటంకించిన సోర్స్ నే సాక్షి కధనం కూడా ఉటంకించింది. కాబట్టి రెండు కధనాలలో విషయం దాదాపు ఒకటే. ఇలాంటి కధనాలు తెలుగు పత్రికల్లో రావడం అరుదు కనుక సాక్షి కధనాన్ని కూడా బ్లాగ్ లో ప్రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో దీనిని కూడా ప్రచురించడం జరుగుతోంది. ఇక్కడ క్లిక్ చేస్తే…

డీమానిటైజేషన్: అమెరికా చెప్పిందే మోడీ చేశారు!

[పై కత్తిరింపును పి‌డి‌ఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి] ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి. అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి…

Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల…