స్మార్ట్ సిటీ: ఇంతవరకు ఒక్క పైసా రాలింది లేదు!


ద్రవ్య రాజకీయాలు

మోడి ప్రభుత్వం మరో విడత స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించింది. స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఎంపిక అయిన నగరాలను కేంద్రం ప్రకటించడం ఇది మూడోసారి. ఇన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఈ రెండేళ్ల మోడి పాలనలో విదేశీ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా (విదేశీ పెట్టుబడి కాబట్టి ఒక్క డాలర్ కూడా అందాం పోనీ) దేశంలోకి, స్మార్ట్ సిటీల్లోకి రాలేదు.

మొదటి విడత 20 నగరాల జాబితా విడుదల చేయగా రెండో విడత 13 నగరాల పేర్లను ప్రకటించారు. ఈసారి అత్యధికంగా 27 నగరాల పేర్లను విడుదల చేశారు. మూడో విడత నగరాలలో ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నది.

100 స్మార్ట్ సిటీలు అంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి ఒకటే ఊదరగొట్టడమే గానీ అలా అనడంలో అర్ధం ఏమిటో చెప్పినవారు లేరు. స్మార్ట్ సిటీ పధకం నిజానికి అమెరికాకు చెందిన స్మార్ట్ సిటీ కౌన్సిల్ బ్రెయిన్ చైల్డ్ అన్న సంగతి తెలిసిన వాళ్లు కూడా చాలా తక్కువ మందే.

స్మార్ట్ సిటీగా ఎంపిక అయిన నగరాలకు సంవత్సరానికి 100 కోట్ల చొప్పున అయిదేళ్ళ పాటు కేంద్రం ఇస్తుందని చెప్పారు. అంటే అయిదేళ్లలో 500 కోట్లు! ఈ డబ్బుతో కొత్తగా సౌకర్యాలు అభివృద్ధి చేస్తారా అంటే సమాధానం అవును/కాదు అని చెప్పాల్సి ఉంటుంది.

ఎందుకంటే అప్పటికే నిర్దిష్ట స్ధాయికి సౌకర్యాలు అభివృద్ధి అయితేనే స్మార్ట్ సిటీగా నిధులు పొందడానికి అర్హత సాధిస్తాయి.

గతంలో…

అసలు టపాను చూడండి 547 more words

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s