వర్షాలు లేవు గానీ ఎన్నికల పుణ్యాన వాగ్దానాలు వరదై పారుతున్నాయి.
హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో బిజేపి నేత నరేంద్ర మోడి ఎన్ని వాగ్దానాలు కురిపించారో గుర్తుందా?
-
విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేయిస్తాం.
-
‘నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్’ ద్వారా గ్రామాలకు టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ వసతి కల్పిస్తాం. వ్యవసాయం కోసం ఐటి వినియోగిస్తాం. రియల్ టైమ్ సమాచారం అందిస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రిటైల్ వ్యాపారులు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు అందరికీ ఐటి వినియోగం అందుబాటులోకి తెస్తాం.
-
అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ పనీ డిజిటైజేషన్ తప్పనిసరి చేస్తాం.
-
వన బంధు కళ్యాణ్ యోజనా కింద ట్రైబల్ అభివృద్ధి ఆధారిటీ ఏర్పాటు చేస్తాం. పూర్తి విద్యా వ్యవస్ధలు నెలకొల్పడం, ఇళ్ళు-నీరు-ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల, గిరిజన గ్రామాల విద్యుదీకరణ, గిరిజన సంస్కృతి ఉట్టిపడే ఉత్పత్తులకు టూరిస్టు పట్టణాలలో ప్రోత్సాహం… మొ.వి ఈ పధకంలో అమలు చేస్తాం.
-
గిరిజనులను భూముల నుండి వెళ్లగొట్టకుండా చూస్తాము.
-
మైనారిటీ విద్యా సంస్ధలు, వ్యవస్ధలను బలీయం కావించి ఆధునీకరిస్తాం. నేషనల్ మదరసా మోడర్నైజేషన్ కార్యక్రమం చేపడతాం.
-
అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రాధామ్యతా ప్రాతిపదికన ఇతర అభివృద్ధి జిల్లాలతో సమాన స్ధాయికి తెస్తాం.
-
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధను సమీక్షించి సగటు మనిషి మేలు జరిగేలా భేషైన పంపిణీ పద్ధతులను తెస్తాం.
-
వివిధ స్ధాయిల్లో Felloship, Internship కార్యక్రమాలు ప్రవేశపెట్టి యువత సేవలను గవర్నెన్స్ లో వినియోగిస్తాం.
-
యుద్ధ ప్రాతిపదికన న్యాయస్ధానాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం. కింది స్ధాయిలో కోర్టులు, జడ్జిల సంఖ్య రెట్టింపు చేస్తాము.
-
పెండింగ్ కేసులు తగ్గించడానికి నేషనల్ లిటిగేషన్ పాలసీ తెస్తాం. పెండింగ్ కాలం తగ్గిస్తామ్.
-
కోర్టుల ఆధునీకరణకు, సామర్ధ్యం పెంపుకు నిధి ఏర్పాటు చేస్తాం.
-
గంగా ప్రక్షాళన చేస్తాం. దేశవ్యాపితంగా నదులన్నీ శుభ్రం చేసేస్తాం.
-
గ్రామాల వరకు జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ నిర్మిస్తాం. బహిరంగ స్ధానాల్లో వై-ఫై జోన్లు ఏర్పాటు చేస్తాం.
-
50 టూరిస్టు సర్క్యూట్ల నిర్మాణం కోసం మిషన్ చేపడతాము. ఆర్కియాలజీ, హెరిటేజ్, సంస్కృతి, హిమాలయాలు, ఎడారి, సముద్ర తీరం, వైద్యం… మొ.న అంశాలు ధీమ్ గా ఈ సర్క్యూట్లు ఏర్పాటవుతాయి.
-
కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు మెరుగుపరుస్తాం.
-
ప్రభుత్వ రికార్డులు డిజిటైజ్ చేసి ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండేలా చేస్తాం.
-
ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలు అన్నింటికి సామర్ధ్య ప్రదర్శన సమీక్షలు, సామాజిక-పర్యావరణ ఆడిట్ లు నిర్వహిస్తాం.
-
పంచాయితీల నుండి కేంద్రం వరకు కవర్ చేస్తూ నేషనల్ ఈ-గవర్నెన్స్ నెలకొల్పుతాం.
-
ప్రతి ఇల్లూ డిజిటల్ అక్షరాస్యతతో నింపుతాం. ఇండియాను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతాం.
-
ప్రభుత్వ పధకాల డెలివరీ సక్రమంగా జరగడం కోసం మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఇతర ప్రభుత్వ అంగాలు అన్నింటిని రేషనలైజేషన్ చేస్తాం.
-
జైళ్ల వ్యవస్ధని టెక్నాలజీతో, మౌలిక వసతులతో ఆధునీకరించి, భద్రత మానవ హక్కులను బలీయం చేస్తాం.
-
సైబర్ క్రైమ్ నిరోధానికి పోలీసులకు సాంకేతిక శిక్షణ ఇప్పిస్తాం.
-
మత నేతలతో చర్చించి వక్ఫ్ బోర్డులకు అధికారాలు కల్పిస్తాం; వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను తొలగిస్తాం.
-
100 స్మార్ట్ నగరాలు నిర్మిస్తాం. వీటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు ఉంటాయి.
-
బాల కార్మిక నిషేధ, నియంత్రణ చట్టం సమీక్షించి, సవరించి, బలీయం చేస్తాం. సమగ్ర శిశు రక్షణ పధకం తెస్తాం.
-
వికలాంగ వ్యక్తుల హక్కుల బిల్లు తెస్తాం. వికలాంగ వ్యక్తిని పోషించే కుటుంబానికి అత్యధిక పన్ను రాయితీ ఇస్తాం.
-
దేశవ్యాపితంగా ఇరుగు పొరుగు పిల్లలు, యువకులతో కూడిన యూత్ పార్లమెంటులు నడుపుతాం. తద్వారా ఉత్తేజపూరిత విద్యార్ధుల కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తాం.
-
‘నేషనల్ స్పొర్ట్స్ టేలంట్ సర్చ్ సిస్టం’ ఏర్పాటు చేసి కౌమార దశ నుండే ఆటల నైపుణ్యాన్ని వెలికి తీస్తాం. హౌసింగ్ కాలనీలు అన్నీ విధిగా స్పొర్ట్స్ వసతులు ఉండాలని నిర్దేశిస్తాం.
-
రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పిస్తాం.
-
యాసిడ్ దాడుల బాధితుల నిధి ఏర్పాటు చేసి బాధితుల వైద్య ఖర్చులు, కాస్మోటిక్ సర్జరీల ఖర్చులు భరిస్తాం.
-
పాఠశాల విద్యా బోధనలో ఆత్మ రక్షణ బోధన ప్రవేశపెడతాం.
-
పూర్తి మహిళా సిబ్బందితో మొబైల్ బ్యాంక్ నెలకొల్పి మహిళలలో ప్రత్యేక నైపుణ్యాలు వెలికి తీసే శిక్షణ ఇస్తాము. మహిళా వ్యాపారవేత్తల తయారీకి ఇంక్యుబేటర్ పార్క్ ఏర్పాటు చేస్తాం.
ఇవి మచ్చుకు కొన్ని. రెండేళ్లు గడిచాయి. ఈ వాగ్దానాలలో ఎన్ని నెరవేరాయో, కనీసం నెరవేరే ప్రక్రియలో ఉన్నాయో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే.