శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు.
ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన!
వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల ముందుకు దుముకుతాయని అప్పుడిక పాలితుల స్వామ్యమే ప్రజాస్వామ్యమై వర్ధిల్లుతుందని శ్రీలంక ఎన్నికల్లో మనకు తెలిసే అసలు వాస్తవం.