అమెరికా సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన హ్యూగో ఛావెజ్ ఇక లేడు

వెనిజులా చమురు క్షేత్రాల నుండి లాభాల రాశులను తవ్వుకుపోతున్న అమెరికా బహుళజాతి కంపెనీలను ఉరికించి కొట్టిన బొలివారన్ విప్లవ నేత హ్యూగో ఛావెజ్ తుది శ్వాస విడిచాడు. అమెరికా గూఢచారులు ప్రవేశ పెట్టిన కేన్సర్ జబ్బుతో పోరాడి అలసిపోయిన ఛావెజ్ మంగళవారం రాత్రి కన్ను మూశాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన క్యూబా డాక్టర్లు నాలుగు సార్లు సర్జరీ చేసినప్పటికీ లొంగని కేన్సర్ కణాలు తమ యజమానులు ఆశించినట్లుగానే ఛావెజ్ ను తుదముట్టించిగాని ఊరుకోలేదు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు…

ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆడ శిశువుల పాలిట వధ్య ప్రదేశ్ గా మారుతోంది. కడుపులో ప్రాణం పోసుకున్న వెంటనే పుట్టబోయేది ఆడపిల్లలేనని చెప్పడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సైతం క్యూ కట్టడంతో ఆడ పిండాలు ఎదగకుండానే పీక నులమడానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఆడ పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఆడ శిశువులను గర్భంలోను, పురిటిలోను చంపడాన్ని నివారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో…

సెల్ ఫోన్ ప్రమాదమే, కేంద్ర ఆరోగ్యమంత్రి -కత్తిరింపు

సెల్ ఫోన్ల వాడకం నిస్సందేహంగా ప్రమాదకరమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ సాక్ష్యాత్తూ లోక్ సభలోనే ధృవపరిచారు. ఆ విషయం 1800 కు పైగా జరిగిన పరిశోధనల్లో తేలిందని మంత్రి గారు చెప్పిన సంగతిని ఆంధ్ర జ్యోతి పేపర్ తెలియజేసింది. పేపర్ వార్తను కింద చూడవచ్చు. ఆజాద్ ప్రకటనను బట్టి సెల్ ఫోన్లతోనే కాక సెల్ టవర్లతో కూడా ముప్పే అని తెలుస్తోంది. సెల్ టవర్ల వల్ల పిచ్చుకల జాతి అంతరించుకుపోతోందని వచ్చిన వార్తలు…

కొంత బుద్ధి, కొంత జ్ఞానం

బొమ్మలు, సంభాషణల రూపంలో ఉన్న కింది కొటేషన్లను నాకొక మిత్రుడు ఈ మెయిల్ చేశాడు. వీటిని చదివిన వెంటనే నలుగురితో పంచుకోవాలన్న కొరిక బలంగా కలిగింది. “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విచారం పంచుకుంటే తరుగుతుంది” అంటారు గదా! బహుశా ఆనందం కోవలోకి జ్ఞానం కూడా వస్తుందనుకుంటాను. ఈ బొమ్మలలో వ్యక్తం అవుతున్నది అనుభవజ్ఞులు సమకూర్చిన జ్ఞానం కనుక పంచుకుంటే మరింత ఉపయోగమే కదా! 1)  ఏది నిజం? నిజం అని భావించేవి చాలా వరకు సాపేక్షికమే. ముఖ్యంగా…

పరిభాష తెలిస్తే తేలికే -ఈనాడు ఆర్టికల్ 3వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా?” ఆర్టికల్ మూడవ భాగం ఈనాడు చదువు పేజిలో ఈ రోజు ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. ఈనాడు వెబ్ సైట్ లో చూడదలిచినవారు ఈ లింక్ క్లిక్ చేయగలరు.

పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!

(ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయిన ఎం.వి.రమణ మూర్తి ‘ది హిందు‘ పత్రిక రాసిన వ్యాసానికి యధాతధ అనువాదం ఇది. చాలా మంది విస్మరించే ఒక శాస్త్రీయ వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఒక సామూహిక విస్మరణను సవరించుకుంటే ఆడపిల్లల బతుకులకు కాస్తయినా గ్యారంటీ లభిస్తుందని ఆశిస్తూ ఆయన ఈ వ్యాసం రాసినట్లు కనిపిస్తోంది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు రచయిత సూచించిన పరిష్కారానికి పరిమితులు ఉన్నప్పటికీ…

మదర్ థెరిసా దయ, నిస్వార్ధం ఒట్టి మిథ్య -పరిశోధకులు

మదర్ థెరిసా గురించి ప్రచారంలో ఉన్న సుగుణాలు ఒట్టి మిథ్య అని ముగ్గురు కెనడా పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవాలను విశ్లేషిస్తే దయామయి, నిస్వార్ధపరురాలు అన్న సుగుణాలు ఆమెకు నప్పవని తమ పరిశోధనలో తేలినట్లు మాంట్రియల్ యూనివర్సిటీ, ఒట్టావా యూనివర్శిటీల పరిశోధకులు తెలిపారని ఎ.ఎన్.ఐ వార్తా సంస్థ తెలియజేసింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేకమంది దాతలనుండి వందల మిలియన్ల డాలర్లు విరాళాలుగా సేకరించిన థెరిసా ఆ డబ్బుని తాను చెప్పిన లక్ష్యాలకు వినియోగించలేదని, ఆమె రాజకీయ సంబంధాలు…

సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…

షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…

అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక ‘సారీ‘ చెప్పడం మామూలుగా మారింది.…

హిందువుల కంటే నాస్తికులే ఎక్కువ!

నాస్తికులంటే … అదో తిట్టు పదంగా భావించినకాలముంది. దేవుడూ, భక్తీ, పూజలూ, మొక్కుబడులూ, స్తోత్రాలూ… వీటినిమారుమాటాడకుండా ఆమోదించాలనేమీ లేదనీ; వాటి ఉనికినీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించొచ్చనీ, అలా చేసే నాస్తికులు అనేవారు కూడా ఉంటారనీ- ఇదేమీతెలియని తరం ప్రస్తుతం ఉంది! ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ‘ఈనాడు’లో వచ్చిన ఒక వార్త విశేషంగా అనిపించింది! దీన్ని ఎంతమంది గమనించారో గానీ, దాని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాను. ”ప్రపంచంలో ఏ మతాన్నీ ఆచరించని వారు ఉన్నారు. ఏ మతాన్నీ ఆచరించనివారు…

బడ్జెట్ 2013-14: వేతన జీవులకు 2000/- ముష్టి

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా…

బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…