బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో

అమెరికా అనే సామ్రాజ్యవాద మత్త గజాన్ని తెలిసి తెలిసి ఢీకొన్న నేటి కాలపు హీరో బ్రాడ్లీ మేనింగ్. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాల్లో అమెరికా సైనికులు, అధికారులు పాల్పడిన అమానవీయ హత్యాకాండలు, సామాన్య పౌరులపై సాగించిన యుద్ధ నేరాలు తదితర సమాచారాన్ని ‘వికీ లీక్స్’ కి అందజేసి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న దారుణ కృత్యాలకు కేంద్రం అమెరికాయేనని ససాక్ష్యాలతో వెల్లడి చేశాడు బ్రాడ్లీ మేనింగ్. అత్యంత రహస్యంగా బ్రాడ్లీ మేనింగ్ ని విచారిస్తూ తాను నిత్యం వల్లించే…

భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

బొగ్గు కుంభకోణం, మరో చీకటి అధ్యాయం

భారత పాలకవర్గాల అవినీతి చరిత్రలో మరో రసవత్తర అధ్యాయానికి తెర లేస్తోంది. 2జి కుంభకోణం దరిమిలా 122 లైసెన్సులను రద్దు చేసి కాంగ్రెస్ పాలకుల అవినీతి మాలిన్యాన్ని ధృవపరిచిన సుప్రీం కోర్టే తాజా అధ్యాయానికి నాందీ వాచకం పలుకుతోంది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం బొగ్గు గనుల కేటాయింపులు ఒక పద్ధతి లేకుండా జరిగినట్లు స్పష్టం అవుతోందని, అవసరమైతే కేటాయింపులన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అసలు బొగ్గు గనుల కేటాయింపుల రాష్ట్రాల…

ఇటలీ నమ్మక ద్రోహం!

అసలే ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న ఇండియా, ఇటలీ సంబంధాలు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత క్షీణించే పరిస్ధితి ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసొస్తామని చెప్పి వెళ్ళిన భారతీయ జాలరుల హంతకులను తిరిగి ఇండియాకి పంపేది లేదని ఇటలీ ప్రకటించింది. రాయబార చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తాము చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యాలయానికి సోమవారం రాత్రి సమాచారం వచ్చినట్లు…

ఢిల్లీ అత్యాచారం నిందితుడు రాంసింగ్ హత్య?

ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు…

ఐక్య వేదికలూ… వ్యూహాలు -ఈనాడు ఆర్టికల్ 4వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ నాలుగవ భాగం ఈ రోజు ఈనాడు పత్రికలోని ‘చదువు’ పేజీలో ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇవ్వడమైనది. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో ఈ ఆర్టికల్ ను నేరుగా చదువాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగలరు. కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు. – –

హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి ‘సెక్యులరిజం‘ కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు. బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో…

ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది! ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి…

యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…

మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…

కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2

విదేశీ చమురు కంపెనీలు చెల్లించే రాయల్టీలను గణనీయంగా పెంచి దానిని ప్రజోపయోగాలకు తరలించడానికి ఛావెజ్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. 2001 చట్టం ద్వారా చమురు అమ్మకాల ఆదాయంలో విదేశీ కంపెనీల వాటాను 84 నుండి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. భార చమురు వెలికి తీసే ఒరినికో చమురు బేసిన్ లో చమురు రాయల్టీలను 1 శాతం నుండి 16.6 శాతానికి పెంచింది. ఈ చెల్లింపులకు బడా చమురు కంపెనీలు ఎక్సాన్, కొనొకో ఫిలిప్స్ తిరస్కరించడంతో వాటిని…

హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -1

అది న్యూయార్క్ నగరం లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం. ప్రపంచ రాజకీయ ఆధిపత్య సాధనకు అమెరికా పనిముట్టుగా తిరుగులేని రికార్డు సంపాదించిన ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయ భవనంలో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత రోజే అదే చోట ప్రసంగించడానికి పోడియం ఎక్కిన వ్యక్తి ఒక అభివృద్ధి చెందిన దేశానికి నాయకుడు. తమ దేశంలోని ఆయిల్ వనరులను ప్రజల జీవన స్థాయిని పెంచడానికి వినియోగ పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో…

ఛావెజ్ మరణం అమెరికా పన్నాగం కావచ్చు –రష్యా నాయకుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు. “అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న…