బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా…

అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?

(సోమా చౌధురి జనవరి 9 తేదీన తెహెల్కా పత్రికకు రాసిన వ్యాసం ఇది. తెహెల్కా పత్రికకు ఆమె మేనేజింగ్ ఎడిటర్. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రమ గారు తన వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలే దాదాపుగా ఇందులో వ్యక్తం అయ్యాయి. ప్రధాన స్రవంతి లోని పత్రికా రచయితలు దేశ సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ మాత్రం ప్రశ్నించడం ఒకింత సంతృప్తి కలిగించినా, ఆంగ్ల పత్రిక కనుక లక్ష్యిత సెక్షన్లను చేరదన్న తెలివిడి నిరాశను కలిగిస్తుంది. తెలుగు బ్లాగర్లకు…

నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా

(ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రితం, తనపై నలుగురు సంస్కృతీ కాపలాదారులు రెండు గంటలపాటు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన మూడు సంవత్సరాల తరవాత ‘సొహైలా అబ్దులాలి’ రాసిన వ్యాసం ఇది. దీనిని మహిళా పత్రిక ‘మానుషి’ ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ భారత సమాజంలో పితృస్వామిక విలువలు మారని వైనాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది. భారత పాలకులు అదే బూజుపట్టిన, స్త్రీలను చెరబట్టిన బురదలోనే దొర్లుతున్నారని ఈ వ్యాసంలోని అంశాలనూ, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారు వరదలా పారిస్తున్న…

ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

రచన: నాగరాజు ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…

గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం…

అత్యాచారాలపై ఎలా స్పందించాలి? ఓ బాధితురాలి మాటల్లో… -వీడియో

ఈ వీడియోలో మాట్లాడుతున్న వక్త పేరు సునీతా కృష్ణన్. స్వచ్ఛంధ సంస్ధగా ఎందరో పాపలను, బాబులను, అమ్మాయిలను, మహిళలను కాపాడిన ఈమె స్వయంగా చిన్నతనంలో జరిగిన సామూహిక అత్యాచారానికి బాధితురాలు. పేగులు బైటికి వచ్చే విధంగా అనేకమంది చేత అత్యాచారం చేయబడిన నాలుగేళ్ల పాప గురించీ ఇంకా అనేకమంది గురించీ ఈమె చెబుతుంటే మనుషుల మానవత్వంపై గట్టి అనుమానం రాకతప్పదు. ఫ్లెష్ ట్రేడ్ బాధితులకు ధైర్యం ఇవ్వడానికి టన్నుల కొద్దీ సానుభూతి ఇచ్చినా అది అక్కరకు రాదనీ…

బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది.…

కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే

“ప్రపంచానికి నాకూతురు పేరు తెలియాలి. నాకూతురు తప్పేమీ చేయలేదు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చనిపోయింది… నా కూతురంటే నాకు గర్వంగా ఉంది. ఆమె పేరు వెల్లడిస్తే ఇలాంటి దాడులు ఎదుర్కొని బైటపడినవారికి ధైర్యంగా ఉంటుంది. నాకూతురినుండి వారు శక్తిని పొందుతారు” అని 53 సంవత్సరాల బద్రిసింగ్ పాండే చెప్పడాని బ్రిటన్ పత్రిక ‘సండే పీపుల్’ తెలిపింది. మరో ప్రఖ్యాత పత్రిక ‘డెయిలీ మిర్రర్’ కి ఇది అనుబంధం. అమ్మాయి పేరును కూడా పత్రిక వెల్లడించింది. ఉత్తర…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…

దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష

లైంగిక అత్యాచారాల నిరోధం విషయంలో భారత ప్రభుత్వానికి దక్షిణ కొరియా ఒక దారి చూపినట్లు కనిపిస్తోంది. అత్యాచార నేరస్ధులకు ‘రసాయన పుంస్త్వనాశనం’ (chemical castration) ఒక శిక్షగా విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రతిపాదించగా దక్షిణ కొరియా కోర్టు ఒక పెడోఫైల్ (చిన్నపిల్లలపై అలవాటుగా లైంగిక అత్యాచారం చేసే వ్యక్తి) కి మొదటిసారిగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కెమికల్ కేస్ట్రేషన్ కు అనుగుణంగా 2011లో చట్టం చేసిన తర్వాత దక్షిణ కొరియాలో…