చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి
అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక…














