పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

సిరియాలో ఆల్-ఖైదా ను ప్రవేశపెట్టింది అమెరికా, నాటోలే -అమెరికా చరిత్రకారుడు

‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి విదితమే. ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశామని కూడా ప్రకటించిన అమెరికా అదే సంస్ధకు చెందిన టెర్రరిస్టులకు ఆయుధాలు ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టిందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు, రచయిత, ఆర్ధికవేత్త, జర్నలిస్టు అయిన వెబ్స్టర్ టార్ప్లే తెలిపాడు. ప్రాంతీయంగా టర్కీ ప్రధాని ఎర్డోగన్, విదేశీ మంత్రి దవుతోగ్లు ల దురభిమానాన్ని, అత్యాశను రెచ్చగొట్టి సిరియా కిరాయి తిరుగుబాటులో…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…