ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ,…

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్…

బ్యాంక్సీ వీధి చిత్రాలు… కాదు, కాదు, పెయింటింగ్స్ -ఫొటోలు

బ్యాంక్సీ, వీధి చిత్రాలకు చిరునామా అని పాఠకులకు తెలిసిన విషయమే. కులీన వర్గాల ‘అధారిటేరినియనిజం’ పై చాచి కొట్టేలా ఉండే బ్యాంక్సీ వీధి చిత్రాలకు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, లెక్కకు మిక్కిలిగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ టపాలో ఇస్తున్నవి బ్యాంక్సీ వీధి చిత్రాలు కావు గానీ, వాటికి ఏ మాత్రం తగ్గనివి. కాసిన్ని గీతల్లో, స్టెన్సిల్ టెక్నిక్ తో అధికార మదానికి  బ్యాంక్సీ ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్, అపహాస్యం, సునిశిత విమర్శ ఈ…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

అమెరికా ఆర్ధిక వృద్ధి ఆశావాహంగా లేదు -ఐ.ఎం.ఎఫ్

అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది. 2012 సంవత్సరానికి గాను అమెరికా…

కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం…

తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు

భారత దేశంలో తుఫానొచ్చి గట్టిగా గాలి వీస్తే విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి రోజుల తరబడి చీకట్లో మగ్గవలసి రావడం పరిపాటి. మనిషి అభివృద్ధి చేసుకున్న ఆధునిక సాధనాలు ప్రకృతిపై మనిషి పై చేయి సాధించేందుకు దోహదం చేశాయి. అయితే ప్రకృతి విలయతాండవానికి తెగిస్తే అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటేననీ సాక్షాత్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ తో పాటు ఇంకా అనేక నగరాల కష్టాలే చెబుతున్నాయి. పెను తుఫాను ధాటికి 18 మంది మరణించడమే కాక…

స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక

ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. టర్కీ విమానం కూల్చివేతను అడ్డు…

బి.జె.పి ఆట ఎవరితో? -కార్టూన్

కర్ణాటకలో సంక్షోభం ముదిరి పాకాన పడుతోందని పత్రికలు, ఛానెళ్ళు ఘోషిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రెట్టించిన బలంతో పార్టీ అధిష్టానాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇతర పార్టీలకంటే ‘విభిన్నమైనది’ గా చెప్పుకున్న ఆ పార్టీ క్రమంగా ‘విభేధాలకు నిలయం’ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలకు గురయిన నాయకుడు నలుగురికీ ముఖం చూపించడానికి సిగ్గుపడడానికి బదులు ప్రజల ముందు ధీమాగా తిరుగుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఫలితంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీలతో తలపడడానికి…

పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని…

వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…