కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు

పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయురాలైన అతని భార్య హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ఫ్రెంచి జాతీయులైన తమ ముగ్గురు పిల్లలను భర్త కస్టడీకి ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తోంది. ఫ్రెంచి రాయబారిపై కేసు…

ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు.…

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…

ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…

అత్యాచారం ఆరోపణలపై వుమెన్ అధ్లెట్ ‘పింకీ ప్రామాణిక్’ అరెస్ట్

తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై భారత మాజీ అధ్లెట్ పింకీ ప్రామాణిక్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పింకీ ప్రామాణిక్ వాస్తవానికి మహిళ కాదనీ, మగవాడేననీ బాధితురాలు ఆరోపించినట్లు బెంగాల్ పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తోందని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని వారు తెలిపారు. సౌత్ ఆసియా గేమ్స్, ఆసియాడ్, కామన్ వెల్త్ లాంటి పోటీల్లో భారత దేశానికి వివిధ గోల్డ్…

యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక…

టెర్రరిస్టు వ్యతిరేక పోరాట సహకారానికి అమెరికా మొండి చేయి

భారత దేశం ఎదుర్కొంటున్న టెర్రరిస్టు సమస్య పై పోరాటంలో సహకారం ఇవ్వవలసిన అమెరికా అందుకు నిరాకరిస్తున్నదని భారత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. టెర్రరిజం పై పోరాడేందుకు ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉన్నప్పటికి అది ఆచరణలో ఒక వైపు మాత్రమే అమలవుతోందని చెబుతున్నాయి. భారత దేశం వైపు నుండి అమెరికాకి ఎంతగా సహకారం అందజేస్తున్నప్పటికీ భారత దేశానికి సహకారం ఇవ్వవలసిన పరిస్ధితిలో అమెరికా మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇరు దేశాల విదేశాంగ…

భారత దేశ సార్వభౌమాధికారంలోకి చొరబడుతున్న ఎస్&పి -కార్టూన్

ఎస్ & పి రేటింగ్ సంస్ధ పరిమితులను దాటుతోంది. ఎకనమిక్ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తూ పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులకు మార్గదర్శకత్వం వహించే పాత్ర పరిమితులను దాటిపోయింది. ఇండియా క్రెడిట్ రేటింగ్ ని ‘ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్’ కంటే తగ్గిస్తామని హెచ్చరిస్తూ ఈ కంపెనీ, భారత ప్రభుత్వ నాయకత్వ సామర్ధ్యం పై కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది. జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలను మన్మోహన్ నాయకత్వంలోనూ, సోనియా గాంధి చొరబాటులోనూ వెతకడానికి ప్రయత్నించింది. రేటింగ్ ఇచ్చే పేరుతో…

ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి

అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను తాము కంపెనీలకు చెందినవారుగా భావించలేకపోతున్నార తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆటంకాలకు  అమెరికా సమాజంలో ఆసియన్లకు వ్యతిరేకంగా, అమెరికన్లకు అనుకూలంగా ‘పక్షపాతం’ పాతుకుపోయి ఉండడమే కారణమనీ ఇటీవలి సర్వేనూ, వివిధ నిపుణులనూ ఉటంకిస్తూ తెలియజేసింది. ఆసియా-అమెరికన్…

మన కాలంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ‘కారల్ మార్క్స్’ -బిబిసి సర్వే (2005)

మన కాలంలో అత్యంత గొప్ప తత్వవేత్త ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి బి.బి.సి రేడియో 4, 2005 లో సర్వే నిర్వహించింది. 20 మంది ముఖ్యమైన తాత్వికులను బి.బి.సి షార్ట్ లిస్ట్ చేయగా వారిలో ‘కారల్ మార్క్స్’ అత్యధిక ఓట్ల శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచాడు. అత్యంత గౌరవనీయమైన, ప్రభావశీలమైన ‘ఫిలసాఫికల్ ధింకర్స్’  లో ‘కారల్ మార్క్స్ ప్రధమ స్ధానంలో నిలిచాడని బి.బి.సి జులై 13, 2005 తేదీన ప్రకటించింది. 30,000 మంది ఓట్లను లెక్కించగా,…

ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

ప్లే స్టేషన్ కోసం మహిళను హత్య చేసిన బాలుడు

ప్లే స్టేషన్ కొనుక్కోవడం కోసం 14 సంవత్సరాల బాలుడు వృద్ధ మహిళను హత్య చేసి నగలు దొంగిలించాడు. పిన్నితో కలిసి పొరుగింటి మహిళను హత్య చేసిన బాలుడు తర్వాత శవాన్ని పాక్షికంగా తగలబెట్టి దూరంగా వదిలిపెట్టాడు. బాలుడు, అతని పిన్ని, శవాన్ని దూరంగా పారేయడానికి సహరించిన బాబాయి లు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు లోని కాంచీపురం జిల్లా ఎస్.పి ఎస్.మనోహరన్ ప్రకారం తిరువుల్లూరు జిల్లా సరిహద్దులోని సెంగాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గుర్తు…

ముందు నీ రాష్ట్రం సంగతి చూసుకో, మోడీ తో నితీష్

బీహార్ అభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించాడు. బీహార్ గురించి వ్యాఖ్యానించే ముందు గుజరాత్ సంగతి చూసుకోవాలని హెచ్చరించాడు. నేరుగా మోడీని సంబోధించకుండానే సొంత రాష్ట్ర వ్యవహారం సరిచేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించినంత పని చేశాడు. బీహార్ లో కుళ్ళిపోయిన కుల రాజకీయాల వల్ల ఆ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ఆదివారం రాజ్ కోట్ లో బి.జె.పి సమావేశంలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడి వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు…

రక్షిస్తానని వచ్చి లిబియా పౌరులను భక్షించిన రోగ్ ‘నాటో’

ఆయుధ మదంతో అచ్చోసిన ఆంబోతులా ప్రపంచంలోని స్వతంత్ర దేశాలను కబళిస్తున్న నాటో, ‘మానవతా జోక్యం’ పేరుతో పశువులా తెగబడుతున్న వైనాన్ని ఐక్యరాజ్య సమితి నివేదికలు, మానవ హక్కుల సంస్ధలు ఈసడిస్తున్నాయి. గడ్డాఫీ బారినుండి లిబియా పౌరులను రక్షిస్తానంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న నాటో, వైమానిక బాంబు దాడులతో  వేలమంది పౌరుల్ని చంపేసి అంతర్జాతీయ సంస్ధల విచారణకు మోకాలడ్డుతోందని హార్ట్ ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ లో బోధిస్తున్న విజయ్ ప్రసాద్ ‘ది…

జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ

ప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పైన దాఖలైన రెండవ, మూడవ ఛార్జీ షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనపై పి.టి (ప్రిసనర్ ట్రాన్సఫర్) వారంట్ జారీ చేసి సోమవారం ఇతరులతో పాటు కోర్టుకి రప్పించుకుంది. మే 27 నుండి జగన్…