జి20, రియో సభలో మన్మోహన్ బడాయి -కార్టూన్

జి 20, రియో సభల కోసం ప్రధాని మన్మోహన్ వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు వెళ్లివచ్చాడు. మెక్సికో లో జి 20 సమావేశాలు జరగ్గా బ్రెజిల్ రాజధాని ‘రియో డి జనేరియో’ లో ‘రియో + 20’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సమావేశాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ పై 1992 లో మొదటి సారి ‘ఎర్త్ సమ్మిట్’ పేరుతో రియోలోనే ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. మళ్ళీ 20 సంవత్సరాల…

మంచు ఖండంలో నిత్యాగ్నిహోత్రం ‘మౌంట్ ఎరేబస్’ -ఫొటోలు

క్షణమాత్రంలో ఎర్రని మంటను సైతం శ్వేతశిల గా మార్చగలిగే అంటార్కిటికా వాతావరణంలో నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే అగ్నిపర్వతం ‘మౌంట్ ఎరేబస్.’ అంటార్కిటికా లో ‘మౌంట్ సిడ్లే’ తర్వాత ఇదే ఎత్తయినది. శాశ్వత లావా సముద్రం కలిగిన పర్వతంగా ‘మౌంట్ ఎరేబస్’ ప్రాముఖ్యత పొందింది. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ లో భాగమే మౌంట్ ఎరేబస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రింగ్ లో ఇంకా 160 చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ తెలిపింది.…

ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3

ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ…

సైన్యం కనుసన్నల్లో పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం -కార్టూన్

శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ…

ఎంబసీ నుండి బైటికి వస్తే అస్సాంజ్ అరెస్టు ఖాయం

జూలియన్ అస్సాంజ్ ఈక్వెడార్ ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేయడానికి లండన్ పోలీసులు ఎంబసీ ముందు కాపు కాశారు. ఎంబసీ లోకి ప్రవేశించడం ద్వారా కోర్టు బెయిల్ షరతులలో ఒకటయిన ‘రాత్రి పూట కర్ఫ్యూలో ఉండవలసిన’ నిబంధనను జులియన్ ఉల్లంఘించాడని లండన్ పోలీసులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకూ తనకు నిర్దేశించిన ఇంటినుండి అస్సాంజ్ బైటికి రాకూడదనీ, కానీ ఆయన మంగళవారం మొత్తం ఈక్వెడార్ ఎంబసీలో…

మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)

ప్రధానమంత్రి పదవి కోసం ఎన్.డి.ఏ లో పోటీ తీవ్రం అయినట్లు కనిపిస్తోంది. మౌతమౌఢ్యం ఉన్నవారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించరని ఎన్.డి.ఏ భాగస్వామి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు శివానంద్ తివారీ బుధవారం వ్యాఖ్యానించి మోడి పట్ల తమ పార్టీ కి ఉన్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశాడు. 2014 లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో లేక ప్రతిపక్షంలోనే కూర్చోవాలో బి.జె.పి నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చరించాడు. నరేంద్ర మోడి ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘మతమౌఢ్యంతో నిండిన…

జూలియన్ అస్సాంజ్ మరో పాచిక, ఈక్వెడార్ ఎంబసీ లో ఆశ్రయం

ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్న జూలియన్ అస్సాంజ్, తనను స్వీడన్ కు తరలించాలన్న లండన్ సుప్రీం కోర్టు తీర్పుని ఎదుర్కోవడానికి మరో పాచిక విసిరాడు. అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్న ఈక్వెడార్ తనకు ఆశ్రయం ఇవ్వాలని జూలియన్ దరఖాస్తు చేశాడు. అందులో భాగంగా బ్రిటన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని శరణువేడాడు. ఈక్వెడార్ అధ్యక్షుడు గతంలో జూలియన్ కు ఆశ్రయం ఇవ్వజూపిన నేపధ్యంలో అస్సాంజ్ విసిరిన పాచిక సంచలనం కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని గుప్పిట్లో…

మల్టి ఎక్స్‌పోజర్: ఒకే ఫొటోలో బహుళ కదలికలు -ఫొటోలు

మల్టీ ఎక్స్‌పోజర్ టెక్నిక్ తో తీసిన ఫొటోలివి. వెనువెంటనే వివిధ సమయాల్లో తీసిన ఫొటోలను ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక ఘటనలో ఒకే వ్యక్తి కొద్ది సెకన్ల తేడాతో చేసే కదలికలను పట్టి ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ తెచ్చే ఈ ప్రక్రియలో ఫొటోలు చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి. అంటే వివిధ సమయాలలో చేసిన కదలికలను ఒకే ఫొటోలో చూడడం అన్నమాట. ఇవి చూడడానికి కళాత్మకంగా…

గిలానీ ప్రధాని పదవికి అనర్హుడు, పాక్ సుప్రీం కోర్టు సంచల తీర్పు

పాకిస్ధాన్ మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ఆధికారాల కోసం జరుగుతున్న ఘర్షణలో తాజా అంకానికి తెర లేచింది. ప్రధాని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితం సుప్రీం తీర్పు చెప్పిన నేపధ్యంలో ప్రధాన మంత్రి గిలానీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినట్లేననీ, కనుక గిలానీ పదవి నుండి దిగిపోవాల్సిందేనని సంచల రీతిలో తీర్పు ప్రకటించింది. ప్రధానిని పదవి నుండి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందనీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనలను…

ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ

ఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని…

ఇంటర్నెట్ సెన్సార్ షిప్ లో అమెరికా తర్వాత స్ధానం ఇండియాదే -గూగుల్

2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలుగా వర్ధిల్లుతుండడం గమనార్హం. 2011 లో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగంలో ఇండియా నుండి 49 శాతం ఎక్కువగా సెన్సార్ షిప్ ఆదేశాలు అందాయని గూగుల్…

కట్టెలమ్మిన చోట పూలమ్మనున్న ప్రణబ్ -కార్టూన్

పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో…

కాంగీ, టి.డి.పి రెంటి నుండీ ఓట్లు గుంజుకున్న వైకాపా

18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒక లోక్ సభ నియోజకవర్గానికీ జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ చూసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీల నుండీ వైకాపా ఓట్లు గుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువగా ఈ సారి కాంగ్రెస్ కి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఓట్లు చేజిక్కించుకున్న వైకాపా తెలుగుదేశం నుండి…

అణు విద్యుత్తుని పక్కకు నెట్టి, సోలార్ విద్యుత్ తో రికార్డులు సృష్టిస్తున్న జర్మనీ

ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్…

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని…