అమెరికాలో ఉద్యోగాల వేట -కార్టూన్

కార్పొరేట్ కంపెనీలన్నీ బెయిలౌట్లు మెక్కినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సుతరామూ ఇస్టపడడం లేదు. ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ జోక్యాన్ని విమర్శించే కార్పొరేట్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన  బెయిలౌట్లు తేరగా మెక్కి బ్రేవ్ మని త్రేన్చి తిరిగి ఉద్యోగాల రూపంలో చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం నుండి అమెరికా సాధించిన రికవరీ ‘జాబ్ లెస్ రికవరీ’ గా చరిత్రలో మొదటిసారి చరిత్ర పుటలకు ఎక్కనుంది. – –

ఇండియా బ్యాంకుల రేటింగ్ తగ్గించిన ‘మూడీస్’

‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంస్ధ భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్ధ రేటింగ్ తగ్గించింది. ‘స్ధిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) రేటింగ్ కు తగ్గించింది. భారత దేశ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, ఆస్తుల క్వాలిటీ విదేశాల్లో దెబ్బతినడం, బ్యాంకుల పెట్టుబడీకరణ, లాభదాయకత దెబ్బతినడం రేటింగ్ తగ్గించడానికి కారణాలుగా మూడీస్ పేర్కొంది. ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకోవడం, ప్రభుత్వం అధికంగా అప్పులు తెచ్చుకోవడం వల్ల ప్రవేట్ క్రెడిట్ మార్కెట్ లో నిధుల లభ్యతను తగ్గించివేస్తుందనీ దానివల్ల ప్రవేట్ అప్పు…

‘గోధ్రా’ అనంతర హత్యాకాండ, 31 మందిపై నేర నిర్ధారణ

గోధ్రా లో రైలు దహనకాండ అనంతరం, నరేంద్ర మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలపై జరిగిన దారుణ హత్యాకాండపై జరుగుతున్న అనేక కేసుల విచారణలో మొదటిసారిగా నేర నిర్ధారణ జరిగింది. సర్దార్ పురా హత్యకాండకుగాను 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. శిక్షలు ఇంకా ఖరారు కావలసి ఉంది. హత్యాకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ విచారణ జరిగిన కేసులో కోర్టులో నేర నిర్ధారణ జరగడం…

రోము లో ఇప్పుడు ఫిడేలు వాయించడం ‘బెర్లుస్కోని’ వంతు -కార్టూన్

ఫ్యూడల్ రాజుల కాలం పోయి, ‘ప్రజాస్వామ్య’ రాజుల కాలం వచ్చింది. ఇద్దరూ రాజులే కనుక రోం నగరం తగలబడుతున్నపుడు ఇద్దరూ ఫిడేలే వాయిస్తున్నారు. ప్రజల పట్లా, వారి సమస్యల పట్లా అప్పటి రాజు దృక్పధం ఎలా ఉన్నదో, ఇప్పటి రాజుల దృక్పధం కూడా అలానే ఏడుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ ధనికులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకే రాజు వద్ద అగ్ర స్ధానం. వారికోసమే రాజ్యాలూ, రాజ్యపాలనానూ. అప్పటికీ, ఇప్పటికీ ఆకలి, దరిద్రం, కరువూ అన్నీ ప్రజల సొత్తే. ఇటలీ విషయంలో…

యూరోప్ లైఫ్ బోట్ కి వళ్ళంతా చిల్లులే -కార్టూన్

ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని…

‘హరిద్వార్’ పుణ్యక్షేత్రం వద్ద తొక్కిసలాట, 16 మంది భక్తుల దుర్మరణం

హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు. కొన్ని పదుల వేలమంది హాజరైన…

పెట్రోల్ ధరలపై త్రిణమూల్ బెదిరింపులు ఉత్తుత్తివే

“పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం” అని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చివరికి తన బెదిరింపులు నిజమైనవి కావని తేల్చేసింది. మంగళవారం ప్రధానితో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి లు ప్రధాని నుండి తమకు ఏ విధమైన హామీ రాలేదని చెప్పారు. “(ఇప్పుడు పెంచితే పెంచారు), ఇకముందు పెంచకూడదు” అని హెచ్చరించి వచ్చాం” అని కూడా వారు పత్రికలకు చెప్పి చక్కా పోయారు. ‘లేస్తే మనిషిని కాను’ టైపు ప్రకటనలతో ప్రజల్నీ,…

సొమ్ములు నొక్కడానికి పాపులిస్టు ఫోజులు, మమత నక్క జిత్తులు

పెట్రోలు ధరలు ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు దార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పదకొండు సార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై గతంలో ఎన్నడూ నోరు విప్పని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్ది రోజుల క్రితం రు1.80 లు పెంచితే గయ్యిమని లేచింది. పెంచిన రేట్లు తగ్గిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమంటారా? అంటూ తాఖీదు పంపింది. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తామని తన ఎం.పిలు (తనకు తెలియకుండా)…

వీధి బాలుడి చిత్ర కళా కౌశలం -వీడియో

తాను అనుకున్న బొమ్మని చాలా వేగంగా ఈ గీసేస్తున్నాడు, ఈ బాలుడు. చూడ్డానికి వీధి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా చేరదీసి శిక్షణ ఇవ్వగలిగితే, లేదా ఇప్పిస్తే తన ప్రతిభను ఇంకా ఉన్నత స్ధాయిలో రుజువు చేసుకోగలడేమో. ఫేస్ బుక్ పేజి లో ఈ వీడియో లభ్యమయ్యింది.

ముస్లింల దైవ ప్రార్ధనలో క్రమశిక్షణ ఉంటుంది -బక్రీద్ ఫొటోలు

ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా. హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా. బౌద్ధ మత ప్రార్ధనలు ఎలా ఉంటాయో ఎరుగం. శిక్కుల గురుద్వారాల్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. అయితే గురుద్వారాల్లో హిందూ దేవాలయాల్లో కనిపించేటంత కోలాహలం ఉండదు. బహుశా జైన…

ఇజ్రాయెల్ వెబ్‌సైట్లపై ‘ఎనోనిమస్’ సైబర్ దాడులు, నిరాకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఆర్మీ లతో పాటు వివిధ ప్రభుత్వ వెబ్ సైట్లపైన సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ‘ఎనోనిమస్’ సంస్ధ ప్రకటించిన రెండు రోజుల్లోనే సదర్ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ రూపొందించడంలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురైతే ఆ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైట్లను ఎవరూ హ్యాక్ చెయ్యలేదనీ, కొన్ని సమస్యలవలన మాత్రమే తాత్కాలికంగా…

విడిపోయి ఓడిపోవడం ఇపుడు యూరప్ వంతు? -కార్టూన్

ఎక్కడికక్కడ విభేధాలు సృష్టించి ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నాయి యూరప్ దేశాలు. ఇపుడు తమ అప్పు సంక్షోభం పరిష్కరించుకునే విషయంలో యూరప్ దేశాలు ఏకాభిప్రాయం కుదరక కిందమీదలవుతున్నాయి. గట్టి పరిష్కారం చూపలేక విడిపోయిన అభిప్రాయాలతో సాయం చెయ్యమని బైటివారిని కోరుతున్నాయి. – –

జీహాదిస్టులకు సమీపంలో పాక్ అణ్వస్త్రాలు, కొట్టిపారేసిన పాకిస్ధాన్

పాకిస్ధాన్ నిల్వ చేసుకున్న అణ్వస్త్రాలు అక్కడ తలచాదుకున్న జిహాదీ శక్తులకు అత్యంత సమీపంలో ఉన్నాయనీ, పాక్ అణ్వస్త్ర భద్రత ప్రమాదంలో పడిందనీ విశ్లేషిస్తూ అమెరికా పత్రిక “అట్లాంటిక్’ ప్రచురించిన కధనాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది తమ శత్రువులు నిరంతరం తమకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారమేననీ, నిజానికిది కొత్తకాదనీ పాక్ నిరసించింది. వాస్తవంలో అమెరికా డేగకళ్ళనుండే తమ అణ్వస్త్రాలకు ప్రమాదం ఏర్పడిందనీ పాకిస్ధాన్, అమెరికా మొఖాన్నే కాసింత బురద జల్లింది. పాకిస్ధాన్ దేశాన్ని, అమెరికాకి ‘నరకం నుండి…