ఎస్.బి.ఐ డౌన్ గ్రేడ్ తో భారత షేర్ల పతనం

ఇండియా షెర్ మార్కెట్ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్, గత ఐదు వారాల్లో మరోసారి 16,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్ సంస్ధ, దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ తగ్గించడంతో దాని ప్రభావం షేర్లపై పడింది. వరుసగా మూడవరోజు పతనమైన సెన్సెక్స్ మంగళవారం 286.59 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 15745.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 1.6 శాతం నష్టపోయి 4772.15 పాయింట్ల వద్ద ముగిసింది.…

రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల సుప్రీం కోర్టుకి దారిద్ర్య రేఖ ప్రమాణాలపై సమర్పించిన అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతోంది. సోనియా గాంధి నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ సభ్యుడు ఎన్.సి.సక్సేనా అహ్లూవాలియా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కించడానికి విధించిన ప్రమాణంపై నిరసనపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. “రోజుకి 32 రూపాయల ఆదాయంతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవని ఆయన ‘మెయిల్ టుడే’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. “మనిషనేవాడెవ్వడూ రోజుకు రు.32/-తో బతకడం అసాధ్యమని…

అమెరికాలో కదం తొక్కుతున్న “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం -ఫొటోలు

వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా వాల్ స్ట్రీట్ కు అమెరికా సంపదను దోచిపెడుతున్న అమెరికా పాలకులకు వ్యతిరేకంగా “వాల్ స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం న్యాయార్క్ నగర వీధుల్లో కదం దొక్కుతున్న దృశ్యాలివి. సి.బి.ఎస్ న్యూస్ సంస్ధ వీటిని ప్రచురించింది.

అమెరికాలో “వాల్ స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం” ఉద్యమ హోరు

అమెరికాలో ఇప్పుడు “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమం హోరెత్తిస్తోంది. అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలని అణచివేయడానికీ అది వీలు కాకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికీ పావులు కదపడంలో బిజీగా ఉన్న అమెరికా తన ప్రజలు ఈజిప్టు ఉద్యమం తరహాలో చేస్తున్న ఉద్యమంతో కూడా సతమతమవుతోంది. అమెరికాలో నిరసనకారులు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమం చేయకపోవచ్చు గానీ అక్కడి ప్రజల్లో అమెరికా అవినీతి ప్రభుత్వంపైనా, విఫలమైన వ్యవస్ధపైన దాచిపెట్టుకున్న వ్యతిరేకత, ఎదుర్కొంటున్న నిరాశా నిస్పృహలు నిరసనల రూపంలో, “వాల్‌స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం”…

రెండు తలల పిల్లి -ఫొటోలు

ఆ మధ్య రెండు తలల పాము ఒకటి కనపడి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండు తలల పిల్లి వార్తలకెక్కి అబ్బుర పరుస్తోంది. ఈ ఫోటోలు సెప్టెంబరు 28 న తీసినవి. మసాఛుసెట్స్ లోని వార్సెస్టర్ లో నివసిస్తున్న మార్టి అనే ఆవిడ తన పిల్లిని ఫొటో లు తీయడానికి అనుమతించింది. తన రెండు తలల పిల్లికి ఆమే ఫ్రాంక్, లూయి అని పేర్లు పెట్టిందట. ఈ తరహా పిల్లులని జానుస్ కేట్ అంటారట. రోమన్ మైధాలజీలో ఒకే తలలో…

భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -3

పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్ధలలో ప్రజాస్వామ్యం ఒక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉన్నదని ఎలా చెప్పగలం? ప్రజాస్వామ్యం అన్నదానికి నిర్వచనాన్ని పరీక్షించి అందులో వివరించినట్లుగా దాదాపు అన్ని లక్షణాలు సదరు వ్యవస్ధలో ఉన్నట్లయితే, ఆ వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ప్రజాస్వామ్యం ఉందని చెబుతున్నారు. సొషలిస్టు రష్యాలో గానీ, సొషలిస్టు చైనాలో గానీ అక్కడి ప్రజలకు కూడా తెలియని అంశాలను ప్రస్తావించి ఇదే సోషలిజం అని చెప్పి దీనికంటె అమెరికాలో బాగుంది కదా, అందువలన…

సిరియా సంస్కరణలకు అమెరికాయే అడ్డం -కార్టూన్

అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…

ప్రధాని పదవి కోసం బిజెపిలో అప్పుడే పోరు మొదలు

సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగానే బి.జె.పి లో పదవీ కుమ్ములాటలు మొదలైనట్లు కనిపిస్తోంది. శుక్ర, శనివారాలలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హాజరు కాకుండా ఎగవేయడంతో ఈ కుమ్ములాటలు బైటికి వచ్చాయి. మోడి రాకపోవడాన్ని బి.జె.పి ప్రతినిధులు చిన్నవిషయంగా కొట్టి పారేస్తున్నప్పటికీ ఆయన గైర్హాజరీకి వారు ఇచ్చిన కారణాలు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడంలోనే అసలు విషయం వెల్లడవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో రాజకీయ పరిస్ధితిపై…

బూటకంగా తేలిపోయిన నరేంద్రమోడి “సద్భావన”

“శాకాహారం మాత్రమే భోంచేస్తానని” మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ నిర్వహించిన పులి గారు తన దీక్ష విరమించి నెలరోజులు కూడా కాక మునుపే తన “మాంసాహార” లక్షణాలను దాచి ఉంచుకోలేకపోయింది. తనకు తెలిసిన నిజాన్ని వెల్లడి చేసిన పొలీసు అధికారి సంజీవ్ భట్ పై కానిస్టేబుల్ చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరెస్టు చేసింది. కనీసం ఆయన భార్యను గానీ, లాయర్ ను గానీ కలవనీయకుండా నిర్భంధించింది. “నిన్నటి నుండీ సంజీవ్ ను కలవడానికి నన్ను…

“దైవ దూషణ” హత్య నిందితుడికి పాక్ కోర్టు మరణ శిక్ష

“దైవ దూషణ”కు పాల్పడ్డాడంటూ పాకిస్ధాన్ లోని రాష్ట్ర గవర్నర్ ను దారుణంగా కాల్చి చంపిన పోలీసు అధికారికి పాకిస్ధాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్ధాన్ లో ‘దైవ దూషణ’ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఆటంకాలని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని తస్సీర్ ప్రచారం చేశాడు. బ్లాస్ఫెమీ నేరానికి శిక్ష పడ్డ ఆసియా బీబీ అనే వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం…

రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా

పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు…