టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…

యూరప్ సంక్షోభంలోనూ దండుకుంటున్న ధనికులు -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి…

రంగులను చూడడంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా -బొమ్మ

ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.…

‘ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ నాశనం’, రెండేళ్ళ క్రితమే హెచ్చరించిన అమెరికా

తన మూర్ఖ పద్ధతులను మార్చుకోకపోతే మరో ఇరవై ఏళ్లలో ఇజ్రాయెల్ ఒక దేశంగా అంతరించడం ఖాయమని అమెరికా రెండేళ్ల క్రితమే హెచ్చరించింది. ఈజిప్టు, ట్యునీషీయా తిరుగుబాట్లగురించి రెండేళ్ల క్రితం అసలు ఊహించనైనా సాధ్యం కాదు. అటువంటి పరిస్ధుతుల్లోనే అమెరికా ఇటువంటి హెచ్చరిక చేసిందంటే గత తొమ్మిది నెలలుగా అరబ్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ అంతానికి ఇరవై సంవత్సరాలు కూడా అవసరం లేదేమో! ఒబామా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన మూడు వారాల తర్వాత జనవరి 2009లో…

మానవ లిబర్టీ విగ్రహం -1918 నాటి ఫొటో

18,000 మంది అమెరికా సైనికులు లిబర్టీ విగ్రహం ఆకారంలో నిలబడి ఉండగా తీసిన ఫోటో ఇది. 1918 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐవా నగరంలో ‘కేంప్ డాడ్జి’ వద్ద తీసిన ఫొటో ఇది. విగ్రహంలో వివిధ ఎఫెక్టులు రావడం కోసం కొంతమంది సైనికులు టోపిలు ధరిస్తే మరికొందరు టోపిలు లేకుండా నిలబడ్డారు. కొన్ని చోట్ల టోపి ధరించి తల వంచి నిలుచుంటే, మరికొన్ని చోట్ల టోపితో తల ఎత్తి నిలబడ్డారు. టోపి లేకుండా కూడా…

కరుణానిధి తండ్రి హృదయం

సోమవారం మారన్ సోదరుల ఇళ్ళపైన సి.బి.ఐ అధికారులు దాడి చేసి రోజంతా తనిఖీలు జరిపి కీలకమైన రికార్డులు పట్టుకెళ్ళారు. –వార్త కరుణా నిధి: నేను నా కూతురు కనిమొళినీ  మారన్ సోదరులనూ సమానంగా చూస్తాను. (అందుకే కనిమొళి ఉన్నచోటుకే మారన్ సోదరులను కూడా పంపించాలని చూస్తున్నారు) – — —

దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!

దళితులకంటే దళితులు స్త్రీలని మరోసారి రుజువైంది. ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న ఓ ధనిక దళిత కుటుంబం తోటి పేద దళిత మహిళను నగ్నంగా గ్రామంలో ఊరేగించిన దారుణం చోటు చేసుకుంది. కక్ష సాధించే క్రమంలో డబ్బుకీ, రాజకీయ పలుకుబడికీ స్త్రీలే ప్రధమ లక్ష్యమని ఈ సంఘటన మరొకసారి చాటి చెప్పింది. విడాకులు తీసుకున్న తమ కూతురు వేరే యువకుడితో కలిసి గ్రామం నుండి వెళ్ళిపోవడానికి సాయం చేశాడని బాధిత…

ముంబై దాడులపై పాక్ కోర్టు విచారణ: దాడుల పర్యవేక్షకుని గొంతుతో పాక్ నిందితుడి గొంతు సరిపోలింది

ముంబై టెర్రరిస్టు దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులలో ఒకరి గొంతు ముంబై దాడులను పాకిస్ధాన్ నుండి పర్యవేక్షించిన వ్యక్తి గొంతుతో సరిపోలిందని పాకిస్ధాన్ పోలీసు సాక్షి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్ధాన్ కి చెందిన యాంటి టెర్రరిజం కోర్టు (ఎ.టి.సి) ముంబై దాడులపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును…

ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు

26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…

రోమింగ్ ఛార్జీలు లేని ‘నూతన టెలికం విధానం,’ అందరికీ బ్రాడ్‌బాండ్(అట)

కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి కపిల్ సిబాల్ ‘నూతన్ టెలికం విధానం’ (ఎన్.టి.పి) ప్రకటించాడు. రోమింగ్ ఛార్జిలు లేని ఈ విధానంలో ఐదు ప్రధాన అంశాలున్నట్లు ప్రకటించాడు. పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు పైకి కనిపిస్తున్న ఈ విధానం పూర్తి వివరాలు అందితే తప్ప మంచి, చెడులను నిర్ధారించలేము. కపిల్ ప్రకటించిన ఐదు ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి. డిమాండ్ చేయడంతోనే బ్రాడ్‌బాండ్ (బ్రాడ్‌బాండ్ ఆన్ డిమాండ్) ఒక దేశం-ఒక లైసెన్సు విధానం. దీని ప్రకారం రోమింగ్…

సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం

అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి. సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల…

గ్రీసు కష్టాలు తీరాలంటే తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలి -జర్మనీ మంత్రి

యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు కోసం ప్రకటిస్తూ వచ్చిన బెయిలౌట్ల అసలు ఉద్దేశం ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. గ్రీసు, రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో అవి రెండు బెయిలౌట్ల పేరుతో కఠిన రుణాలను మంజూరు చేస్తున్న సంగతి విదితమే. అత్యంత దారుణమైన షరతులతో ఇచ్చిన ఈ రుణాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. గ్రీసు జిడిపి దారుణంగా పడిపోయింది. రుణ షరతుల ఫలితంగా ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడంతో సంభవించిన ఫలితమిది. వారి షరతులను పూర్తిగా…

భవంతిగుండా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవే, జపాన్ అద్భుతం -ఫొటోలు

సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ  తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే. ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’

ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్…