గడ్డాఫీ మరణంపై పలు అనుమానాలు, అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణ

గడ్డాఫీ మరణం చుట్టూ పలు అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అతని విగత శరీరానికి అంతిమ సంస్కారాలు ఆలస్యం అవుతున్నాయి. సజీవుడిగా పట్టుకున్న ముమ్మర్ గడ్డాఫీ ఎలా చనిపోయాడన్న అంశంపై పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి. గడ్డాఫీని పట్టుకున్న అనంతరం ఒక ట్రక్కులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గడ్డాఫీ మద్దతుదారులకూ, గడ్డాఫీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తిరుగుబాటుదారులకూ మధ్య కాల్పులు జరిగాయనీ, ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బులెట్ గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్ళేలోపు చనిపోయాడనీ తాత్కాలిక ప్రభుత్వం ప్రధానంగా చెబుతోంది.…

గడ్డాఫీని ఎలా చంపేశారు?

ది గార్డియన్ పత్రిక గడ్డాఫీ మరణంపై కొంత సమాచారాన్ని అందించింది. గడ్డాఫీని పట్టుకున్నపుడు ఆయన సజీవంగా ఉన్న వీడియోను ప్రచురించింది. అందులో గడ్డాఫిని పట్టుకుని ట్రక్కులోకి మారుస్తున్న దృశ్యం ఉంది. గడ్డాఫీ బాగా తెలివిగానే ఉన్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ట్రక్కులోకి మారుస్తుండగా ‘అతన్ని సజీవంగా ఉంచండి’ అని ఒకరు అరిచారని గార్డియన్ తెలిపింది. తదనంతరం రక్తపు మడుగులో ఉన్న గడ్డాఫీ ఫొటో అన్ని వార్తా సంస్ధలూ ప్రచురించాయి. ఈ మధ్యలోనే గడ్డాఫీ తలలో…

పట్టుకున్నపుడు బతికే ఉన్న గడ్డాఫీ -ఫొటోలు

గడ్డాఫీ డ్రైనేజి పైపులో దాగి ఉన్నాడనీ, చివరి క్షణాల్లో ‘నన్ను కాల్చొద్దంటూ’ అరిచాడనీ, లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. నలుగురైదుగురు చేతులు పైకిత్తి నవ్వుతున్న ఫొటోలు ప్రచురించి లిబియా అంతా సంబరాలు జరుపుకుంటున్నారని చెబుతున్నాయి. నాలుగు శవాలు పడిఉన్న డ్రైనేజి పైపులను చూపించి గడ్డాఫీ దాక్కున్నది ఇక్కడేనని చూపిస్తున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలని అవి ప్రారంభంలో ప్రచురించిన వార్తలే చెబుతున్నాయి. గడ్డాఫీ పట్టుబడ్డాడని మొదట వార్తలు…

నాటో బాంబు దాడిలో గడ్డాఫీ మరణం -ఫొటో

గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు. జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది. – —

లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని పట్టుకుని చంపేసిన నాటో బలగాలు?

లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీని అతని సొంత పట్టణం సిర్టే లోనే పట్టుకుని చంపినట్లుగా ఆల్ జజీరా టివి ఛానెల్ ప్రకటించింది. బిబిసి, రాయిటర్స్ తదితర ఛానెళ్ళు గడ్డాఫీని పట్టుబడ్డాడని చెబుతున్నప్పటికీ చంపేసిన సంగతిని ధ్రృవీకరించడం లేదు. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని గడ్డాఫీ కేకలు వేసినట్లుగా పశ్చిమ దేశాల వార్తా ఛానెళ్ళు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గడ్డాఫీ గాయపడ్డాడని కొందరు చెబుతుండగా అతన్ని చంపేశారని మరికొందరు చెబుతున్నారని బిబిసి తెలిపింది. “అతను పట్టుబడ్డాడు. అతని రెండు కాళ్ళకూ…

పెద్ద దొంగను పట్టిస్తే జరిగేదేమిటి? -కార్టూన్

సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా…

అమెరికా వ్యాపార రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన చైనీయుడు

అమెరికాలో స్ధిర నివాసం ఏర్పరచుకున్న చైనా శాస్త్రవేత్త ఒకరు అమెరికా వ్యాపార రహస్యాలను చైనాకు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ‘డౌ ఆగ్రో సైన్సెస్’ కంపెనీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేస్తూ వ్యాపార రహస్యాలను అందజేసాననీ, కార్గిల్ కంపెనీలో పని చేస్తుండగా వ్యాపార రహస్యాలను దొంగిలించానని సదరు శాస్త్రవేత్త ‘కీక్సూ హువాంగ్’ అంగీకరించాడని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ (డి.ఒ.జె) డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. గత ఆగస్టులోనే ఇదే విధంగా ‘జున్ వాంగ్’ అనే చైనీయుడు అత్యున్నత సామర్ధ్యంగల న్యూక్లియర్…

“వెయ్యి మందికి ఒకరు, ఒకరికి వెయ్యి మంది” -కార్టూన్

మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఫ్రాన్సు సైనికుల ఉపసంహరణ

ఫ్రాన్సు సైనికులలో మొదటి బ్యాచ్ ఆఫ్ఘనిస్ధాన్ నుండి స్వదేశం చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ సైనికుల విరమణ జరుగుతుంది. మొదటి విడతగా 200 మంది సైనికుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ఫ్రాన్సు ప్రకటించింది. గత జులైలో ఆఫ్గనిస్ధాన్ సందర్శించిన సందర్భంగా తమ సైనికులను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి ప్రకటించాడు. అది ఇప్పుడు ప్రారంభమయ్యింది. రెండవ విడతలో మరో 200 మంది సైనికులను విరమిస్తామని ఫ్రాన్సు తెలిపింది. రాబోయే క్రిస్టమస్ పండగలోపు రెండవ విడత సైనికులు ఫ్రాన్సు…

చెప్పు విసిరింది కేజ్రీవాల్ పైన కాదు, వందిమాగధుల అత్యుత్సాహంపైనే

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్ల ఛాంబర్ లోకి జొరబడి ప్రఖ్యాత లాయర్ ‘ప్రశాంత్ భూషణ్’ పైన దాడి చేసి కొట్టిన కొద్ది రోజుల్లోనే మరో అన్నా టీం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా దాడి జరిగిందని పత్రికలు వార్తను ప్రచురించాయి. సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగి పోతున్నాయని అసహనం వ్యక్తం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక దుండగుడు చెప్పు విసిరాడనీ, అతనిని అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారులు అక్కడే పట్టుకుని చావబాదారనీ తెలిపాయి. అయితే,…

‘సౌదీ’ దరిద్రంపై వీడియో తీసినందుకు అరెస్టు -కార్టూన్

సౌదీ అరేబియాకు చెందిన ‘ఫెరాస్ బగ్నా’ దేశ పౌరుడుగా ఓ చిన్న ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియో ద్వారా చూపించి తద్వారా ధనవంతులనుండి విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వాలనుకున్నాడు. అనుకన్నదే తడవుగా ఫెరాస్ సౌదీ రాజధాని రియాధ్ లో పేద ప్రాంతాలకు వెళ్ళి వారి ఇళ్ల లోపలి భాగం కూడా చూపించి, వారి ఆర్ధిక పరిస్ధితి గూర్చి వారి చేతనే చెప్పించి ఆ దృశ్యాలతో ఒక వీడియో రూపొందించాడు. తన వంతు బాధ్యతగా తాను…

సౌదీ అరేబియా ‘దరిద్రం’పై వీడియో తీసినందుకు అరెస్టు (+వీడియో)

కొద్ది వారాల క్రితమే మహిళలకు ఓటు హక్కు ఇస్తున్నట్లు ప్రకటించి అరబ్ ఆందోళనలనుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా రాజు తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు. కారు నడిపిన నేరానికి స్త్రీలను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ‘సౌదీ అరేబియా’లో కూడా దరిద్రం తాండవిస్తున్నదనీ, అది కూడా రాజధాని నగరంలోనే ఉన్నదని చూపిస్తూ వీడియో తయారు చేసినందుకు ‘ఫెరాస్ బగ్నా’ అనే పౌరుడిని అరెస్టు చేయించాడు. ‘ఫెరాస్ బగ్నా’ తాను తీసిన వీడియో ఇంటర్నెట్…

సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం

అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత…

ఒక ఇజ్రాయెల్ సైనికుడి కోసం 1027 పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక ఖైదీల మార్పిడి ఒప్పందం మంగళవారం అమలవుతోంది. పాలస్తీనీయులు పట్టుకున్న ఒకే ఒక్క ఇజ్రయెల్ సైనికుడుని విడుదుల చేస్తున్నందుకుగానూ ఇజ్రాయెల్ అనేక సంవత్సరాల తరబడి తమ జైళ్లలో ఉంటున్న పాలస్తీనా జాతీయులను విడుదల చేయడానికి సిద్దపడింది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు చివరికి ఫలవంతం అయ్యాయి. మంగళవారం 477 మంది, మరో రెండు నెలల్లో మరో 550 మంది పాలస్తీనా ఖైదీలు…

తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం, ఇక కాంగ్రెసే టార్గెట్

తెలంగాణ పొలిటికల్ జె.ఎ.సి సారధ్యసంఘం సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం రాత్రి పది గంటల సమయంలో ముగిసింది. సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ) రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెరాస, న్యూడెమొక్రసీ, ఉద్యోగ జె.ఎ.సి ప్రతినిధులు పత్రికలతో మాట్లాడారు. పొలిటికల్ జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను,…