పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…

గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు నిశ్చింతగా గడిపారు. అటువంటి గడ్డాఫీని చంపి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల ధనికుల ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి అడుగులకు మడుగులొత్తే తొత్తు పాలకులు లిబియాని ఏలడానికి సిద్దంగా ఉన్నారు. గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు ఎన్ని సౌకర్యాలు అనుభవించారో తెలుసుకుంటే వారిపైన అసూయ కలుగుతుంది. లిబియాలో విద్యుత్ వాడుకున్నందుకు నెల నెలా బిల్లులు రావు. దేశ ప్రజలందరికీ విద్యుత్ ఉచితం. (కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై బాదే అధికారులు అక్కడ…

ఇదే నా విల్లు -మౌమ్మర్ గడ్డాఫీ

ఇది నా విల్లు. మౌమ్మర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుస్సలాం బి హుమాయ్ద్ బిన్ అబు మాన్యర్ బిన్ హుమాయ్ద్ బిన్ నాయిల్ ఆల్ ఫషి గడ్డాఫీ అను నేను, ప్రమాణం చేసి చెప్పునదేమనగా, అల్లా తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ దేవుడి ప్రవక్త, ఆయనకు శాంతి లభించు గాక. నేను ముస్లిం గానే మరణిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నన్ను చంపేస్తే గనక, ముస్లిం సాంప్రదాయాల ప్రకారమే నన్ను పూడ్చిపెట్టాలి. చనిపోయినపుడు ఏవి ధరించి ఉన్నానో…

పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా

యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా…

ఇంతకీ ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం ఎందుకోసం? -కార్టూన్

— పెట్టుబడిదారుడు: అయితే, మీ నిరసనలు దేనికోయ్? నిరసనకారుడు 1: ఉద్యోగాలు, ఇళ్ళు, ఆరోగ్య సంరక్షణ, విద్య… నిరసనకారుడు 2: న్యాయం, నిజాయితీ, నమ్మకం, మార్పు, హేతుబద్ధత… నిరసనకారుడు 3: శాంతి, శుభ్రమైన గాలి, నీరు, భూమి, భవిష్యత్తు… నిరసనకారుడు 4: ?! పెట్టుబడిదారుడు: అంతేనా? —

పాక్‌పై అమెరికా దాడి చేస్తే ఆఫ్ఘనిస్ధాన్ పాక్ పక్షమే నిలుస్తుంది -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

“పరిస్ధితులు అనుకూలించక అమెరికా పాకిస్ధాన్ పైన దాడి చేసినట్లయితే, దైవం నివారించుగాక, ఆఫ్ఘనిస్ధాన్ నిస్సందేహంగా పాకిస్ధాన్ కే మద్దతుగా నిలుస్తుంది” అని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించాడు. అమెరికా, పాక్ పై దాడి చేయడం ప్రస్తుత పరిస్ధితుల్లొ పూర్తిగా అసంగతం అయినప్పటికీ మాటమాత్రంగానైనా ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షానే నిలుస్తానని చెప్పడం సంతోషించ దగిన విషయం. కనీసం మాటల్లోనైనా ఆఫ్ఘన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షాన నిలిచాడు. నిజానికి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య…

సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…

నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు

గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ…

ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం

చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…

ప్రేమ దక్కవలసిందెప్పుడు? దక్కుతున్నదెప్పుడు?

ఈ కవిత ఫేస్ బుక్ నుండి సంగ్రహించాను. రచయిత ఎవరో తెలియదు. చక్కగా రాశారు. అంకితా రెడ్డి అన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో దీనిని చూశాను. ఈ కవిత క్రెడిట్ అంతా ఆ అజ్ఞాత రచయిత/త్రి కే చెందుతుంది. – — —

ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…

231 మంది పార్లమెంటు సభ్యత్వం సస్పెండ్ చేసిన పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్

ఎన్నికల సంస్కరణల గురించి భారత దేశ నాయకులు ఇంకా మాట్లాడడం ప్రారంభమే కాలేదు. పాకిస్ధాన్ మాత్రం ఆ విషయంలో ఓ పెద్ద ముందడుగు వేసింది. తమ ఆస్తులను నిర్ణీత వ్యవధిలోగా ప్రకటించనందుకు గాను ఏకంగా 231 మంది చట్ట సభల సభ్యుల సభ్యత్వాన్ని పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల సంస్కరణలపై కూడా తాను పోరాడుతానని అన్నా హజారే గతంలో ప్రకటించాడు. ఆయన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రకటన చేసినందుకే రాజకీయ నాయకులు…