ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో…

14(F) రద్దుకు బందు సరే; కె.సి.ఆర్-కాంగ్రెస్ నాటకాల బందు ఎన్నడు?

పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం హైద్రాబాదును ఫ్రీ జోన్ గా పరిగణిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన 14(F) ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ బందు విజయవంతమైనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. తెలంగాణ విద్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర తెలంగాణ ప్రజా సంఘాల మద్దతుతో తెలంగాణ బందును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వార్తా ఛానెళ్ళు ప్రకటించాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) క్లాజును తొలగించాలని తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణ…

సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా

హ్యాకింగ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. హ్యాకింగ్ లాంటి సైబర్ దాడులకు అసలు కారకులు అమెరికా, ఇండియాలేనని చైనా ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలనుండి ప్రపంచంలోని అనేక ప్రభుత్వాల వెబ్‌సైట్లు, ప్రముఖుల ఈ మెయిళ్ళు పెద్ద ఎత్తున హ్యాకింగ్ కి గురయ్యాయని మెకేఫీ సైబర్ సెక్యూరిటి సంస్ధ వారం క్రితం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, ఏసియాన్, ఐ.ఒ.సి, తదితర 72 సంస్ధలు హ్యాకింగ్ కి గురయ్యాయని చెబుతూ, దీని వెనుక…

నాయకులు, ఉద్యోగులు, పోలీసులు… వీరే ప్రజల దృష్టిలో అత్యంత అవినీతిపరులు -సర్వే

ప్రజలు రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకునో, మద్యం తాగో వారికి ఓట్లు గెలిపించినా ఎవరు అవినీతిపరులన్న విషయంలో వారు స్పష్టంగానే ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సంస్ధ నిర్వహించిన “స్టేట్ ఆఫ్ ది నేషన్” సర్వేలో వెల్లడయ్యింది. భారత దేశ వ్యాపితంగా 1300 లొకాలిటీలలో జరిగిన ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత అవినీతిపరులుగా ప్రజలు భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులు అత్యంత అవినీతిపరులుగా…

ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై…

మార్కెట్ల విధ్వంసంపై ఇన్‌వెస్టర్ల హావ భావాలు -ఫోటోలు

గత శుక్రవారం అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఎస్‌&పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అత్యున్నత రేటింగ్ AAA నుండి రెండో అత్యున్నత రేటింగ్ AA+ కి తగ్గించింది. దానితో అమెరికా ప్రభుత్వం, కంపెనీలు, వినియోగదారులకు అప్పుల ఖరీదు (వడ్డీ రేటు) పెరిగిపోయింది. దానివలన పెట్టుబడులు తగ్గి, అప్పటికే అనేక బలహీనతలతో తీసుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణిస్తుందనీ, అమెరికా మరొక సారి మాంద్యానికి (రిసెషన్) గురై అది ప్రపంచం అంతా వ్యాపిస్తుందనీ ఒక్క సారిగా భయాలు ఇన్‌వెస్టర్లను…

మంగళవారం కూడా పతనమైన భారత షేర్ మార్కెట్లు, తొలగని అనిశ్చితి

భారత షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. అమెరికా రుణ సంక్షోభం దరిమిలా ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో సోమవారం ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయీన సంగతి తెలిసిందే. మంగళవారం భారత షేర్లు విపరీతమయిన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. దాదాపు 1600 పాయింట్ల మేరకు గత ఐదు రోజులుగా ఉత్ధాన పతనాలకు గురైన భారత షేర్లు ప్రారంభంలో సోమవారం నాటి ధోరణిని కొనసాగిస్తూ భారిగా పతనమైన సూచిలు మధ్యాహ్నానికి కోలుకుని లాభాల బాట…

ఎన్ని ఆశల పతనానికీ, ఎవరి సుఖ భోగాలకీ మార్కెట్ల పతనం?

అమెరికా షేర్ మార్కెట్లు సోమవారం నాడు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన షేర్ సూచిలు దారుణంగా పతనం అయ్యాయి. అమెరికా రుణ పరిమితి పెంపుదల కోసం, బడ్జెట్ లోటు తగ్గింపు కొసం రిపబ్లికన్లు, డెమొక్రట్ల మధ్య గత శుక్రవారం కుదిరిన ఒప్పందం అమెరికా రుణ సంక్షోభాన్ని ఏమాత్రం శాంతపరచబోదని మదుపుదారులు భావించడంతో మదుపుదారులు ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాలకు పరుగులెత్తారు. అమెరికా షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికీ లోనై అత్యధిక స్ధాయిలో పతనం అయ్యాయి. పై…

రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ 50 సం. పూర్తి చేసుకున్న బారక్ ఒబామా

నెలల తరబడి సాగిన వేడి వేడి చర్చల అనంతరం, ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఆగష్టు 4 తో 50 సంవత్సరాలు నిండాయి. ఆమెరికా కాంగ్రెస్‌లో మెజారిటీ ఉన్న రిపబ్లికన్ల నుండి దీని పట్ల తీవ్రం విమర్శలు వ్యక్తం అయ్యాయి. “ప్రస్తుతం ఈ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా, మనిషి జీవ పరిణామ క్రమంలో భాగమైన వయసు మీరే ప్రక్రియకు తన సమయాన్ని వెచ్చించడం, అమెరికన్లందరినీ అవమానించడమే” అని…

తగలబడుతున్న కాగితం డబ్బు, రెక్కలిప్పిన బంగారం ధర -కార్టూన్

అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా రుణ సంక్షోభం…

అమెరికా రేటింగ్ తగ్గింపుతో నిలువునా కూలుతున్న అమెరికా, యూరప్ షేర్ మార్కెట్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో ప్రపంచంలోని అన్ని దేశాల షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. జపాన్‌ని భూకంపం, సునామీలు తాకిన రీతిలో ఎస్&పి అమెరికా రేటింగ్ తగ్గింపు, ప్రపంచ షేర్ మార్కెట్లను తాకింది. సోమవారం ఇండియా షేర్ మార్కెట్లను దాదాపు రెండు శాతం పైగా లోయలోకి తోసేసిన ఈ పరిణామం యూరప్ షేర్ మార్కెట్లను రెండు నుండి నాలుగు శాతం వరకూ పతనం చేసింది. ఇక అమెరికా షేర్ మార్కెట్లు సైతం రెండున్నర నుండి మూడున్నర శాతం…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు. అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా…

యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్

అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే భారత దేశానికి నష్టకరం -ప్రణాళికా సంఘం

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే దాని ప్రభావం ఇండియాపై తీవ్రంగానే ఉంటుందని భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఒక ఇంటర్వూలో తెలిపాడు. సి.ఎన్.బి.సి-టి.వి 18 ఛానెల్ వారు అహ్లూవాలియాతో ఇంటర్వ్యూ చేసినపుడు ఆయన అమెరికా క్రెడిట్ రేటింగ్ కోత గురించి తన అభిప్రాయాలు తెలిపాడు. ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం వలన పారిశ్రామిక దేశాల్లో ఉద్భవించే ఏకైన సానుకూల పరిణామం, కమోడిటీ (సరుకుల) ధరలపైన ఒత్తిడి పెరగడమేనని తెలిపాడు. కానీ ఇండియాకి వచ్చేసరికి,…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -1

ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఒక మెట్టు తగ్గించింది. అమెరికా మార్కెట్లనుండి ట్రేజరీ బాండ్ల వేలం ద్వారా అప్పు సేకరించే విషయం తెలిసిందే. ఆ విధంగా అప్పు సేకరించడానికి జారీ చేసే బాండ్ల రేటింగ్‌ను ఎస్ & పి తగ్గించింది. ఇలా అప్పులకి రేటింగ్ ఉండడం ఏంటో చాలా మందికి అర్ధం కాని విషయం. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించేవరకూ ఈ రేటింగ్‌ల విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. భారత ప్రభుత్వం…