అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు

జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది. “మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!“ ————————————————— కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం…

బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…

జగన్ అవినీతికి మద్దతుగా రాజీనామాలు

దేశమంతా అన్నా హజారే అందిస్తున్న స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అవినీతికి మద్దతుగా 29 మంది ఎం.ఎల్.ఎ లు ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ జగన్ కి చెందిన అనేక స్ధావరాలపై గత రెండు రోజులుగా దాడులు చేస్తుండడంతో, జగన్ వేసిన ఎత్తుగడ ఇది. రాజీనామాల ఎత్తుగడతో జగన సాధించేదీ ఏమిటో అర్ధం కావడం లేదు. బహుశా ఉప…

అన్నా దీక్ష విరమణకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం?

అన్నా బృందానికీ, ప్రభుత్వానికి మద్య విభేధాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ఊహాగానాలు ఆదివారం వెలువడ్డాయి. మాహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఆదివారం అన్నాను కలవడంతో ఈ ఊహాగానాలు బయలుదేరాయి. అన్నా హజారే మహారాష్ట్ర వాసి కావడం ఈ సందర్భంగా గమనార్హం. సదరు అధికారి, అన్నాల మధ్య జరిగిన చర్చలను “వ్యక్తిగతమైనవి”గా అన్నా బృందం అభివర్ణించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఐతే ప్రధానిని, ఉన్నత న్యాయ వ్యవస్ధను లోక్ పాల్…

అన్నాకి గురువైనందుకు మహాత్మాగాంధి సైతం జైల్లోకే -కార్టూన్

కేంద్ర ప్రభుత్వం అన్నా హజారే అంటేనే ఉలిక్కిపడుతోంది. దీక్ష మొదలు కాక ముందే అన్నా బృందాన్ని అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది. నాలిక్కరుచుకుని విడుదల చేయబోయి అక్కడా దెబ్బతిన్నది. మరోపక్క అన్నా హజారే తన అరెస్టునే ఆందోలనకు అనువుగా మార్చుకోగలిగాడు. అన్నా బృందం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఈ కార్టూన్‌ని భారతీయ కార్టూనిస్టు మంజుల్ గీసింది. – “అన్నా హజారేకి ఆయనే గురువని ప్రభుత్వానికి తెలిసిందట మరి!” —

అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ డూప్ తో -తాలిబాన్

తాలిబాన్ పేరు చెప్పి మోసం చేస్తున్న డూప్ వ్యక్తితో అమెరికా చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రకటించి సంచలనం సృంష్టించింది. తాలిబాన్ తరపున అమెరికాతో చర్చలు జరుపుతున్నాడని వ్యక్తి నిజానికి తమ వద్దనే ఉన్నాడని చెబుతూ, సదరు వ్యక్తి ఇంతవరకు ఎప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి వెళ్ళలేదని తాలిబాన్ వెల్లడించింది. తాలిబాన్‌కి చెందిన ఉన్నత స్ధాయి అధికారితో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపామంటూ ప్రకటించిన అమెరికాకు ఇది ఆశనిపాతం లాంటి వార్తే. తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆదివారం…

కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు

పౌర సమాజ నాయకుడుగా ఆవిర్భవించిన గాంధేయవాది అన్నా హజారే శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం అయిదు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండడమే కాక మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. నిరాహార దీక్ష ప్రారంభం అయినప్పటినుండీ అన్నా చేస్తున్న ప్రసంగాలు కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీల అవగాహనకు సమీపంలో ఉన్న సంగతి గమనార్హం. సి.పి.ఐ (ఎం.ఎల్ – మావోయిస్టు), సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ), సి.పి.ఐ (ఎం.ఎల్ – జనశక్తి) తదితర పార్టీలు భారత దేశంలో విప్లవ…

ఫేస్‌బుక్, ట్విట్టర్… లండన్‌లో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు -కార్టూన్

లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు…

ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?

ఇండియా, బెలారస్ ల మధ్య పొటాష్ ఎరువులకు సంబంధించి కుదిరిన ఒప్పందానికి అమెరికా మోకాలడ్డినట్లు అనుమానాలు తలెత్తాయి. కేబినెట్ నిర్ణయాలను అమెరికాకి చేరవేయడానికి భారత ప్రభుత్వ కేబినెట్ లో అమెరికా ఏజెంటు ఉన్న అనుమానాలు కూడా వాటికి జత కలిశాయి. పాత సోవియట్ రాజ్యం బెలారస్‌లోని పొటాషియం గనులను కొనాలనీ, అలాగే విదేశాలలో ఎరువుల గనులను ప్రాధామ్యం ప్రాతిపదికన సొంతం చేసుకోవాలని కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా ఒక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన రోజునే బెలారస్ పై…

ఈజిప్టు పోలీసులను చంపిన ఇజ్రాయెల్, రాయబారిని ఉపసంహరించుకుంటున్న ఈజిప్టు

ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన ప్రజా ఉద్యమం అనంతరం నియంత ముబారక్ గద్దె దిగాక ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. మిలిటెంట్లకోసం వెతుకుతూ ఈజిప్టు భూభాగంలోనికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్లన్న నెపంతో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఈజిప్టు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుని ఇజ్రాయెల్ రాయబారిని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు ఆందోళన నిర్వహించడంతో తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి విరమించుకోబోతున్నట్లుగా…

రాజకీయ పార్టీల నిధుల సేకరణను దెబ్బతీసిన అమెరికా రుణ సంక్షోభం -కార్టూన్

అమెరికా రుణ సంక్షొభం ప్రభావం అన్ని రంగాల మీదా పడుతోంది. 2012లో జరగనున్న ఎన్నికల కోసం నిధుల సేకరణకు అమెరికా రాజకీయ పార్టీలు ఇప్పటినుండే నిధులు సేకరిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ, ప్రభుత్వ ఖర్చు ఎక్కువయ్యిందని చెబుతూ ప్రజలపైన కఠినమైన పొదుపు విధానాలను రుద్దుతోంది. అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీకి నిధుల లభ్యత విషయంలో సమస్యలు ఎదుర్కోక పోవచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ సమస్యలు తప్పవు. నిధుల సేకరణ విషయంలో వారికి సమస్యలు ఎదురవ్వుతాయని చెబుతూ, ఈ…

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ముగిసింది -పాలస్తీనా సంస్ధ హమాస్

పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ “హమాస్,” శనివారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను అక్రమించిన ఇజ్రాయెల్ తో తనంత తానుగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తలు మరోమారు ఉచ్ఛ స్ధాయికి చేరనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, కారణం లేకుండా తమ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నందున తాము పాటిస్తున్న “కాల్పుల విరమణకు” ఇక అర్ధం లేదని హమాస్ సంస్ధ ప్రకటించింది. గత రెండు…

కాబూల్‌లో బ్రిటిష్ కౌన్సిల్ పై తాలిబాన్ దాడి, ఎనిమిది మంది మరణం

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య ఉండే కాబూల్ లో అడుగడుగునా చెకింగ్ ఉన్నప్పటికీ మిలిటెంట్లు విజయవంతంగా దాడులకు పాల్పడడం కొనసాగుతున్నది. నాటో బలగాలకు ఇది అవమానకరంగా పరిణమించినప్పటికీ అవి తాలిబాన్ దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయి. పేరు…

ప్రభుత్వానికీ, అన్నా బృందానికి మద్య తలెత్తిన ప్రధాన విభేదాలు ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం తన లోక్ పాల్ బిల్లుని రూపొందించుకుని కేబినెట్ లో ఆమోదింపజేసుకుంది. అన్నా హజారే బృందం ముందుకు తెస్తున్న జన్ లోక్ పాల్ డ్రాఫ్టులోని అనేక అంశాలు తమ డ్రాఫ్టులో పొందుపరిచామని చెప్పుకుంది. ప్రభుత్వం తయారు చేసిన బిల్లుని చూసిన అన్నా బృందం దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. కోరలు లేని బిల్లుని తెచ్చారనీ, అది దేశ ప్రజలపై విసిరిన ఓ పెద్ద జోక్ అనీ చెబుతూ తిరస్కరించారు. తాను ముందే హెచ్చరించినట్లుగా అమరణ నిరాహార దీక్షకు…