నేను అన్నాను కాను, పదేళ్ళనుండి దీక్షలో ఉన్న “ఇరోమ్ షర్మిలా”ను

ప్రభుత్వం అన్నా హజారే ఆరోగ్యం కోసం తపన పడుతోంది. కనీసం తపన పడుతున్నట్లు నటిస్తోంది. అన్నా హజారే ప్రాణాలు చాలా విలువైనవనీ, అవి దేశానికి చాలా అవసరమనీ, ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమనీ కనుక ఆయన వెంటనే తన నిరాహార దీక్షను ఉపసంహరించుకోవాలని గురువారం పార్లమెంటులో ప్రధాని విజ్ఞప్తి చేశాడు. బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశం కూడా అన్నా హజారే దీక్ష విరమించాలని కోరింది. గురువారం లోక్ సభ లో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకురాలు…

అరబ్ జాతి ఒకానొక కలని సాకారం చేసుకున్నవేళ… వీడియో, కార్టూన్

మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు. పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో  అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం,…

పౌరుల శవాల సాక్షిగా లిబియాలో “నాటో తిరుగుబాటు” పరిపూర్తి -కార్టూన్

నాటో బలగాలు నాయకత్వం వహించిన “లిబియా తిరుగుబాటు” పూర్తయ్యిందని అమెరికా ప్రకటించింది. ఇన్నాళ్లూ లిబియా ఆయిల్ వనరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలిపోయినట్లుగా పత్రికలు ప్రకటించాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఇన్నాళ్ళూ నేరుగా కుట్రలకు పాల్పడి, ప్రభుత్వాధిపతుల ఇళ్లపై బాంబులు జారవిడిచి తమ అనుకూల ప్రభుత్వాలను నిలబెడుతూ వచ్చిన అమెరికా, యూరప్ దేశాలు లిబియాలో వినూత్న పద్ధతిని అవలంబించాయి. “తిరుగుబాటు” అని ప్రచారం చేసి అది…

చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు. ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8…

అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం

క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…

లిబియాలో గడ్డాఫీ ఉన్నాడా, పోయాడా? -కార్టూన్

నాటో బాంబుదాడులు తోడు రాగా లిబియా తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిలో ప్రవేశించారు. ట్రిపోలీ ప్రజలు ఆనందోత్సాహాలతో వారికి స్వాగతాలు పలికారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బాకాలుదాయి. తిరుగుబాటుదారుల నాయకత్వ కమిటీ ‘ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్’ గడ్డాఫీ ఇద్దరు కొడుకులనూ అరెస్టు చేశామని ప్రకటించింది. వారాల ప్రకటించిన గంటలలోపే గడ్డాఫీ కుమారుడు, ఎలైట్ ఫోర్స్ నాయకుడు సైఫ్ ఇస్లాం తిరిగి ట్రిపోలిలోనే ప్రత్యక్షమయ్యాడు, మద్దతుదారులకు విక్టరీ సిగ్నల్ చూపుతూ. ఇదేలా సాధ్యం? అరెస్టయినవాడు నవ్వుతూ, చేతులూపుతూ ఎలా ప్రత్యక్షమైనట్లు?…

జన్‌లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని అంగీకారం, దీక్ష మానాలని వినతి

అన్నా బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా “జన్ లోక్ పాల్ బిల్లు” ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ అన్నాకు రాసిన ఉత్తరంలో ప్రకటించాడు. ఎనిమిది రోజుల నిరాహార దీక్షను ఇంతటితో ఆపివేయాలని ప్రధాని తన లేఖలో కోరాడు. నెల రోజుల పాటు దేశంలోని ఇతర ప్రధాన సమస్యలనుండి పత్రిల కేంద్రీకరణను తనవైపుకు తిప్పుకున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవధిక నిరాహార దీక్ష మరి కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. అన్నా హజారే…

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏర్పడిందంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920 ల వరకూ సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదం ఇవ్వలేదు. అంటే అప్పటివరకూ జరిగిన ఉద్యమం కొన్ని రాయితీల కోసమే జరిగింది. నామమాత్ర ఎన్నికలు నిర్వహించడం, పాలనలో భారత లెజిస్లేచర్ల అభిప్రాయాలు కూడా పరిగణించడం (అమలు చేయాలని రూలేమీ లేదు) ఇత్యాధి రాయితీల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ (గాంధీతో సహా) ఉద్యమించింది. ఆ తర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమ వ్యాప్తి అన్నీ…

ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లుని 80 శాతం సవరించవచ్చు -స్టాండింగ్ కమిటీ సభ్యుడు

“స్టాండింగ్ కమిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంద”ని సోమవారం ప్రకటించిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మంగళవారం అలాంటిదే మరో కబురు చెప్పాడు. ప్రభుత్వం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లులో 80 శాతం సవరణలు చేయవచ్చునని ప్రకటించాడు. అన్ని వర్గాలవారూ కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనపరచాలని స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్ సింఘ్వీ అన్నాడు. వ్యక్తిగత, ప్రజా సమస్యలు మరియు చట్టం, న్యాయం విషయాలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్…

స్ట్రాస్ కాన్ పై కేసు ఉపసంహరించుకున్న న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు

ఐ.ఎమ్.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ పై రేప్ ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీనితో న్యూయార్క్ హోటల్ మెయిడ్ ను రేప్ ప్రయత్నం చేశాడంటూ స్ట్రాస్ కాన్ పై వచ్చిన ఆరోపణల కేసు పూర్తిగా రద్దయినట్లే. బాధిత మహిళ ప్రవేటు కేసు దాఖలు చేస్తే తప్ప స్ట్రాస్ కాన్ మళ్ళీ కోర్టు గడప తొక్కనవసరం లేదు. బాధిత మహిళ సాక్ష్యం ద్వారా ‘అనుమాన రహితంగా’ రేప్ కేసును రుజువుచేయగలమన్న నమ్మకాన్ని ప్రాసిక్యూటర్లు…

ఐ.ఎం.ఎఫ్, ఇయు షరతుల ఫలితం, ఐర్లండు ప్రజలపై త్వరలో మరో విడత బాదుడు

బెయిలౌట్ మంజూరు చేస్తూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన షరతులతో పాటు రేటింగ్ ఏజన్సీలు, వివిధ బ్యాంకుల ఆర్ధికవేత్తల ఒత్తిడి పెరగడంతో ఐర్లండు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులపై మరో విడత కోతలు, పన్నులు బాదడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం నవంబరు నెలలో ఐర్లండు రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో (చెల్లించగల వడ్డి రేట్లకు మార్కెట్లో అప్పు సేకరించలేని స్ధితి) ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా 67.5 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేస్తూ విషమ షరతులు విధించాయి. కార్మికులు,…