యెడ్యూరప్పకు పులిమీద పుట్ర, అవినీతి కేసులో విచారణకు కోర్టు అనుమతి

కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కు కూడా అక్రమ మైనింగ్ కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనున్న నేపధ్యంలో ఆయనపై మరో సమ్మెట దెబ్బ పడింది. యెడ్యూరప్పపై అవినీతి కేసులు నమోదు చేసి విచారించాలన్న క్రింది కోర్టు తీర్పుపై మార్చిలో విధించిన స్టేను హై కోర్టు గురువారం ఎత్తి వేసింది. స్తే ఎత్తి వేస్తూ ముఖ్యమంత్రిపై అవినీతి పాల్పడ్డాడన్న కేసు నమోదు చేసి విచారణ చేయడానికి…

ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!

ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…

‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…

జనారణ్యంలోకి చొరబడ్డ చిరుతతో ఫారెస్టు గార్డుల ఘర్షణ -ఫోటోలు

ప్రకృతిపై మనిషి సాగించిన పోరాటంలో మనిషిదే అంతిమ విజయం. విజయంతో సంతృప్తి చెందిన మనిషి ధన ధాహంతో ప్రకృతి వినాశనానికి పూనుకుంటున్నాడు. దానితో జనారణ్యం సహజారణ్యంలోకి చొచ్చుకెళ్తోంది. ఫలితంగా జంతువులకు తమ సహజ నివాసంలో జాగా లేక జనారణ్యంలోకి రాక తప్పడం లేదు. రియల్ ఎస్టేట్ రంగ కాసుల దాహం కావచ్చు, అడవుల్లో దొరికే సహజ ఖనిజ వనరులపై బిలియనీర్ల కన్నుపడటం వలన కావచ్చు, అడవుల్లో జంతుజాలానికి నిలవ నీడ లేకుండా పోయింది. ఖనిజాల కోసం, గనుల…

భారత అణుప్రమాద పరిహార చట్టం ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలకు లోబడాలి, అమెరికా కొత్త మెలిక

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, అమెరికాల పౌర అణు ఒప్పందంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అమలు దిశలో మలి దశగా ఈ పర్యటనను పత్రికలు గత కొన్ని రోజులుగా పేర్కొంటూ వచ్చాయి. అమెరికా, భారత్‌కు అణు రియాక్టర్‌లు, అణు పదార్ధం (శుద్ధి చేయబడిన యురేనియం) సరఫరా చేయడానికి అమెరికా తాజాగా మరొక మెలిక పెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార…

చైనాలొ తేనెటీగల్ని ఆకర్షించి, వొంటినే తేనెతుట్టెగా మలిచే పోటీ -ఫోటోలు

తేనెటీగల దండు వస్తుంటేనే చూసి పారిపోతాం మనం. అవి మన శరీరంలో నాటే కొండీలు యమ బాధని కలిగిస్తాయి. కాని చైనాలో ఏకంగా తమ శరీరాలనే తేనెతుట్టెలుగా మార్చే పోటీ జరగడం విశేషం. చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోటీ దృశ్యాలను చూసి తీరవలసిందే మరి. చైనా లోని హూనాన్ రాష్ట్రంలో “షావో యాంగ్” ఊరిలో ఈ తేనెటీగల్ని ఆకర్షించే పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొనేవారు తాము పెంచుకున్న రాణి తేనెటీగల్ని…

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు

ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే…

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని…

ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

హ్యాకింగ్‌కి గురైన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ఫోన్ -కార్టూన్

“నా ఫోన్‌ని హ్యాక్ చేశారా?! అసలే దుఃఖంలో ఉన్న ఈ ముసలోడికి అలా చేయడానికి మనసెలా ఒప్పింది!”   హత్యకు గురైన బాలిక ఫోన్‌ని హ్యాక్ చేసీ, న్యూయార్క్ లోని జంట టవర్లపై జరిగిన టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన వారి ఫోన్లను హ్యాక్ చేసీ, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాల్లో మరణించిన ఇంగ్లండ్ సైనికుల ఫోన్ లను హ్యాక్ చేసి… ఆ సమాచారాన్నే పెట్టుబడిగా “న్యూస్ ఆఫ్ ది వరల్డ్” పత్రికకు పేరు తెచ్చుకున్న రూపర్ట్ మర్డోక్ ఫోన్‌ని…

గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి

పూనే గుర్రాల వ్యాపారి ‘హసన్ ఆలీ ఖాన్’ 800 మిలియన్ డాలర్ల (రు.3600 కోట్లు) నల్లధనాన్ని విదేశీ బ్యాంకులకు తరలించాడని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బోంబే హైకోర్టు కు సోమవారం తెలిపింది. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని బ్యాంకులకు ఈ డబ్బు తరలించినట్లుగా ఇ.డి కోర్టుకు తెలిపింది. ఈ విదేశీ బ్యాంకుల అధికారులతో హసన్ ఆలీ ఖాన్‌కు లోతైన సంబంధాలున్నాయని ఇ.డి తెలిపింది. సెషన్స్ కోర్టు హసన్ ఆలీ ఖాన్ కు…

25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…

రుమేనియా రైలునుండి 64 మిసైల్ వార్‌హెడ్స్ దొంగిలించిన దుండగులు

రుమేనియాకి చెందిన రైలులో రవాణా అవుతున్న మిసైళ్ళ వార్‌హెడ్స్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించిన ఉదంతం సంచలన కలిగిస్తోంది. ఆదివారం, రుమేనియా నుండి బల్గేరియాకు రవాణా అవుతున్న మిసైళ్ళనుండి వార్ హెడ్స్ తొలగించి దొంగిలించినట్లుగా రుమేనియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసిక్యూటర్లు, దొంగతనాన్ని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేరియస్ మిలిటారు, దొంగిలించబడిన విడిభాగాలు వాటంతట అవే ప్రమాదకరం కావనీ మిసైల్ వ్యవస్ధతో కలిసి ఉంటేనే ప్రమాదకరమనీ తెలిపాడు. మిలట్రీ పరికరాలతో…

బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు

మీడియా రారాజుగా అభివర్ణించబడుతున్న స్టార్ ఛానెళ్ళ అధినేత రూపర్ట్ మర్డోక్‌కి చెందిన “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక విలేఖరులు వివిధ నేరాలలో భాధితులైన వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి పత్రిక కధనాలకు వినియోగించారన్న ఆరోపణలతో బ్రిటన్ మీడియా ప్రపంచం అట్టుడుకుతోంది. మర్డోక్‌కి కుటుంబ స్నేహితురాలు, ప్రధాని కామెరూన్‌కు మీడియా అడ్వైజర్‌గా కూడా పేరుపొందిన, “న్యూస్ ఇంటర్నేషనల్” పత్రిక ఛీఫ్ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్‌ను పోలీసులు “ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం” తో సంబంధం ఉందన్న…