బి.జె.పి నోట సెక్యులరిజం మాట

దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది. లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్‌)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా  ఆదివారం నిర్ణయం తీసుకుంది.…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…

నార్వే బాంబు పేలుళ్ళ నిందితుడికి నచ్చిన కొటేషన్

ఓ నమ్మకం కలిగిన ఒక వ్యక్తి, కేవలం ప్రయోజనాలు మాత్రమే కలిగి ఉన్న లక్షమంది బలగంతో సమానం -ఇంగ్లీష్ తత్వవేత్త జాన్ స్టువర్డ్ మిల్. One person with a belief is equal to the force of 100,000 who have only interests. -English Philosopher John Stuart Mill. నార్వే రాజధాని ఓస్లోలో బాంబు పేలుళ్లకు పాల్పడి 7 గురినీ, సమీపంలోని ఉటావో ద్వీపంలో విచక్షణా రహిత కాల్పులకు పాల్పడి 84…

రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నది బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులే -సుప్రీం కోర్టు

రిజర్వేషన్ కోటాల వలన సమకూరుతున్న ఫలితాలను ఆ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు మాత్రమే లబ్ది పొందుతున్నారని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అవి ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వారికి అసలు రిజర్వేషన్ల సంగతే తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం…

ముంజేతులు లేవు, ఐనా స్పిన్ బౌలింగ్‌లో ఘనాపాటి ఈ బాలుడు -వీడియో లింక్

బ్రిటన్‌కి చెందిన కీరన్ టంగ్-గిబ్స్ కి పుట్టుకతోనే ముంజేతులు లేవు. ఒక చేతికి మోచేయి తర్వాత కొద్ది భాగం ఉండగా, రెండో చేతికి మోచేయి కూడా లేదు. అయినా ఒక చేతికి ఉన్న మోచేయిలో క్రికెట్ బంతిని ఇరికించుకుని ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం స్పిన్ ని జతచేసి మరి బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అవే చేతుల్తో బ్యాటింగ్ చేయగలుగుతూ అంగ వైకల్యాన్ని గేలి చేస్తున్నాడు. బ్రిటన్ దేశానికి ఆడాలని కలలు గంటున్న ఈ…

కుట్రదారులు కావలెను -కార్టూన్

“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి…

రేటింగ్‌లతో ఆర్ధిక పతనాలకు కారణమవుతున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు -కార్టూన్

స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), ఫిఛ్, మూడీస్… ఈ మూడు సంస్ధలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ ఉన్న “రేటింగ్ ఏజన్సీలు.” ఇవి వివిధ దేశాల, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీని చేపట్టిని దేశాల సావరిన్ అప్పులకు రేటింగ్ ఇస్తాయి. సావరిన్ అప్పులనే ట్రెజరీ బాండ్స్ అంటారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మార్కెట్ నుండి, అంటే ప్రవేటు పెట్టుబడిదారులనుండి అప్పులు సేకరించడం కోసం ట్రెజరీ బాండ్లు జారీ చేస్తాయని తెలుసుకున్నాం. వివిధ దేశాల ట్రెజరీ బాండ్లలో తమ…

నార్వే బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులు -ఫొటోలు

4.8 మిలియన్ల జనాభా ఉన్న నార్వే శుక్రవారం బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులతో అట్టుడికింది. రాజధాని ఓస్లో నగరంలో ప్రధాన మంత్రి కార్యాలయం సమీపంలో బాంబులు పేలి 7 గురు చనిపోయారు. బాంబు పేలుళ్ళకు కారణమైన వ్యక్తే సమీపంలోని ఉటావో ద్వీపంలో సభ జరుపుకుంటున్న పాలక పార్టీ యువజన సంఘం స్ధలం వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 84 మందికి పైగా టీనేజి యువతీ యువకుల్ని చంపాడు. ఓస్లోలో బాంబు పేలుడు శక్తిని బట్టి చూస్తే…

నార్వేని కుదిపేసిన బాంబు పేలుళ్ళు, కాల్పులు; 87 మంది దుర్మరణం

నార్వే రాజధాని ఓస్లోను బాంబు పేలుళ్ళు కుదిపేశాయి. గంట నుండి రెండు గంటల వ్యవధిలో వరుసగా జరిగిన రెండు సంఘటనల్లో మొత్తం 87 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత గల ప్రాంతంగా భావించే దేశాల్లో ఒకటైన నార్వే రాజధానిలో ఈ ఘటన జరగడం నార్వే వాసులను షాక్ కి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోగా, ఒకటి లేదా రెండు గంటల అనంతరం సమీపంలోని ఉటోయా ద్వీపంలో పోలీసు…

మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో

మిత్రులు కొణతం దిలీప్ గారి బ్లాగ్ నుండి సంగ్రహించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు తమను తాము దహించుకుంటున్న రోజుల్లో 28 ఏప్రిల్, 2010 తేదీన అటువంటి ఒక యువకుడి ఆత్మాహుతి పట్ల నిరసన తెలుపుతూ జరిగిన సభలో శంకరుడినే ప్రశ్నిస్తున్న కళాకారుడి హృదయం ఈ పాట. కొన్ని వందల తల్లుల కడుపు శోకానికి అక్షర రూపం ఈ పాట. అంతమంది తల్లుల గర్భశోక ధ్వని రూపం కూడా ఈ పాట. పాషాణ హృదయులనైనా…

“రిలయన్స్ ఇండస్ట్రీస్”లో 30 శాతం షేర్లు “బ్రిటిష్ పెట్రోలియం” కు అమ్మడానికి కేంద్రం ఆమోదం

మొదట దేశంలోని విలువైన సహజ వనరులను స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం, ఆ అర్వాత స్వదేశీ పెట్టుబడుదారులను తమ కంపెనీలో గణనీయమొత్తంలో షేర్లను విదేశీ బహుళజాతి సంస్ధలకు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడం, తద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ తవ్వకాల రంగంలోని దేశీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్లను నెరవేర్చడం భారత ప్రభుత్వం ఒక ఎత్తుగడగా అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద…

తెలంగాణ రాష్ట్రం కోరడం వేర్పాటువాదం కాదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడాన్ని వేర్పాటువాదంగా కొంతమంది సంభోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడాలని కోరుతున్నారు గనక అది ‘వేర్పాటు వాదమే’ అని వారి వాదనగా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం వేర్పాటు వాదం కాజాలదు. దేశం నుండి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని కోరుకోవడం వేర్పాటువాదం అవుతుంది తప్ప రాష్ట్రాలుగా విడిపోవడం వేర్పాటువాదం కాదు. కాశ్మీరు ప్రజలు తమది ప్రత్యేక…

తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలది, ఉద్యమాన్ని చూపి రౌడీ చర్యలకు దిగడం కట్టిపెట్టాలి

ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లొ కె.సి.ఆర్ అల్లుడు హరీష్ రావు వేసిన వీరంగం ఖండనార్హం. ఏపి భవన్‌లో ఛానెళ్ళ కెమెరాల సాక్షిగా ఆయన చేసిన అరాచకం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఫర్నిచర్‌ని కాళ్ళతో తన్నుకుంటూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, తలుపుల్ని బాదుతూ అంతిమంగా అక్కడ అందుబాటులో ఉన్న అధికారిని రెండు చెంపలపైన కొట్టడం ఒక రాజకీయనాయకుడు, అందునా వెనకబడిన ప్రాంతం హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్న పార్టీకి చెందిన నాయకుడు, చేయకూడని పని. చట్ట…

రెండు తలల పాము -ఫోటో

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఈ రెండు తలల పాముని ప్రదర్శనకు ఉంచారు. పరిమిత రోజుల పాటు మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారని జూ నిర్వాహకులు తెలిపారు. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సె (ఎ.ఎఫ్.పి) వార్తా సంస్ధకి చెందిన ఫోటో జర్నలిస్టు జులై 8 తేదీన ఈ ఫోటోని తీశాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యాల్టా నగరంలో స్కాజ్కా జూ లో దీనిని ఉంచారు. ప్రకృతి విచిత్రాలలో ఇదీ ఒకటి కాబోలు.