అవినీతి బైటపెట్టినందుకు ప్రాణ భయంతో పారిపోయిన ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్

ఆఫ్ఘనిస్ధాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ కదీర్ ఫిట్రాట్ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. గవర్నరు పదవికి రాజీనామా చేసి మరీ పారిపోయిన కదీర్ అమెరికాలో తేలాడు. ఆయనకి అమెరికాలో నివాస గృహం ఉందని తెలుస్తోంది. కాబూల్ బ్యాంక్ అనే ప్రవేటు బ్యాంకులో జరిగిన అవినీతిపై అబ్దుల్ కదీర్ దర్యాప్తు జరిపాడు. అవినీతికి పాల్పడినవారి పేర్లను పార్లమెంటులో బహిర్గతం చేశాడు. ఆయన బైటపెట్టిన పేర్లలో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మహమూద్…

త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

ఆఫ్ఘనిస్ధాన్‌పై పాకిస్ధాన్ రాకెట్ల దాడి, తాలిబాన్‌కి మద్దతుగానేనని కర్జాయ్ ఆరోపణ

గత మూడు వారాలనుండి పాకిస్ధాన్ కనీసం 470 రాకెట్లు ప్రయోగించిందనీ, ఈ దాడిలో 36 మంది పౌరులు మరణించారనీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఆరోపించాడు. చనిపోయినవారిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారనీ ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న కూనార్, నంగర్‌హార్ రాష్ట్రాలలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని ఆఫ్గన్ సరిహద్దు అధికారులు తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. నాటో బలగాలు ఈ రాష్ట్రాలనుండి ఖాళీ చేశాయి. రాకెట్ దాడులతో పౌరులు అక్కడినుండి…

ఇంగ్లండు పర్యటనలో చైనా ప్రధాని, వ్యాపారం పెంపుకు హామీ

ఐదు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాహావో సోమవారం నుండి ఇంగ్లండు లో పర్యటిస్తున్నాడు. తన పర్యటన సందర్భంగా వెన్ “ఇంగ్లండుతో ద్వైపాక్షిక వ్యాపారం మరింతగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. మరిన్ని బ్రిటన్ ఉత్పత్తులు చైనాకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లండులోని చైనా కార్ల కంపెనీ ఎం.జి కార్ ప్లాంటు తయారు చేస్తున్న మోడల్‌ని మరిన్ని ఎంటర్‌ప్రైజ్‌లు ఆధారంగా చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. సంక్షోభంలో యూరోజోన్ దేశాలకు మద్దతు కొనసాగిస్తామని…

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలు ఇవే

గత బుధవారం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు రెండవ బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు ప్రకటించాయి. అందుకు ప్రతిగా గ్రీసు కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయాల్సిందేనని షరతు విధించాయి. తాను అమలు చేయనున్న పొదుపు చర్యలను గ్రీసు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వీటిని రానున్న బుధ, గురువారాల్లో గ్రీసు పార్లమెంటు ఆమోదించాలి. ఐతే ఐర్లండు, పోర్చుగల్ దేశాల మాదిరిగా గ్రీసు ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపక్షాలే కాదు,…

సి.బి.ఐని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడం ఆర్.టి.ఐ చట్టానికే విరుద్ధం

సమాచార హక్కు చట్టం నుండి సి.బి.ఐ (Central Bureau of Investigation) సంస్ధను మినహాయించడం సమాచార హక్కు చట్టానికే విరుద్ధం అని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ తెలిపాడు. అరవింద్ కేజ్రీవాల్ లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో పౌరసమాజ ప్రతినిధిగా నియమించబడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సి.బి.ఐని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నదనీ, ఆ సంస్ధ ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను సాధించడానికే దానిని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడానికి నిర్ణయించిందని అరవింద్…

సమాచార హక్కు చట్టం నుండి మరిన్ని సంస్ధల మినహాయింపు

సమాచార హక్కు చట్టం (Right to Information Act) ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం 2005 లో ప్రవేశ పెట్టిన దగ్గర్నుండీ, చట్టాన్ని ఇప్పటికి అనేకసార్లు తూట్లు పొడిచారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అత్యున్నత సంస్ధలు అన్నింటినీ దీనినుండి మినహాయించారు. తాజాగా మినహాయింపుల జాబితాలో మరో మూడు సంస్ధలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 9 నే దీనికి…

ఇద్దరు లెజెండ్ ఆటగాళ్ళు కలుసుకున్న వేళ -ఫోటోలు

సచిన్ టెండూల్కర్, రోజర్ ఫెదరర్, ఇద్దరూ వారి ఆటల్లో ఉన్నత స్ధానాలకు చేరుకున్నావారు. అయినా ఆటల దాహం తీరక ఇంకా ఇంకా సాధించాలని తపిస్తున్నవారు. తపించడమే కాక శ్రమిస్తున్నవారు. వీరిద్దరూ కలుసుకుంటే, ఆ క్షణాలు వారిద్దరికే కాదు వారిని ఆరాధించే అభిమానులకు కూడా కన్నుల పండుగే. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ కలుసుకున్న అపురూప క్షణాలివి.

ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా…

యూరప్‌లో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం

యూరప్‌లో చైనా వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో విస్తారమైన సహజ వనరులను వెలిలి తీయడంలోనూ, వెలికి తీసిన వనరులలో అధిక భాగాన్ని చైనాకి తరలించుకు వెళ్ళడంలోనూ చైనా చురుకుగా వ్యవహరిస్తోంది. అలాగే యూరప్‌లో సైతం చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. చైనా కంపెనీలు యూరప్‌లో కార్యకలాపాలను నిర్వహించడం పెరిగింది. చైనా వద్ద అత్యధిక మొత్తంలో నిలవ ఉన్న విదేశీమారక ద్రవ్యం తమ దేశాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఇంగ్లండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు…

బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక…

గ్రీసు బెయిలౌట్‌తో పట్టపగ్గాలు లేని ఇండియా షేర్‌మార్కెట్లు

అప్పు సంక్షోభంతో సతమతమవుతున్న గ్రీసు దేశానికి రెండో బెయిలౌట్ ఇవ్వనున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించడంతో భారత షేర్ మార్కెట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్, ఎన్.ఎస్.ఇ నిఫ్టీలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా మూడు శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుండడంతో ప్రపంచ వ్యాపితంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో మందగించినట్లు…

అణ్వాయుధ సామర్ధ్యంపై పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటాం -పాక్, ఇండియా

అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం…

లిబియాపై దాడుల కొనసాగింపుకు అమెరికా ప్రతినిధుల సభ నిరాకరణ

శనివారం అమెరికా కాంగ్రెస్ లిబియాకి సంబంధించి రెండు బిల్లులపై ఓటింగ్ నిర్వహించింది. రెండు బిల్లులపై ప్రతినిధుల సభ ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆశ్చర్యకరం. నాటో నాయకత్వంలో లిబియాపై కొనసాగుతున్న మిలట్రీ ఆపరేషన్‌ను కొనసాగించడానికి అధ్యక్షుడు ఒబామాకు అధికారం ఇవ్వడానికి ప్రవేశపెట్టిన బిల్లును మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. గత కొద్దివారాలుగా లిబియాలో అమెరికా నిర్వహిస్తున్న పాత్ర వివాదాస్పదం అయ్యింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు లిబియా యుద్ధంలో కొనసాగుతుండడాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.…