వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయిన ఇండియా షేర్ మార్కెట్

భారత ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాలను చవి చూశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచడం, వడ్డీ రేట్ల పెంపుదల లాభాల తగ్గుదలకు దారీతీస్తుందన్న భయాలూ, వీటితో పాటు ఆయిల ధరలు అన్నీ కలిసి ఇండియా మార్కెట్లలొ షేర్ల అమ్మకాల వత్తిడి పెరగడానికి దారి తీశాయి. ద్రవ్య సంస్ధలు, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్యపోయాయి. ఎయిర్ టెల్ షేరు 3.2 శాతం నష్టపోయింది. ఎయిర్ టెల్ కి చెందిన…

ఒసామా మృతి తాలూకు ఫోటోల విడుదలకు భయపడుతున్న ఒబామా

ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్‌కి ఇచ్చిన…

నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా…

డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో…

ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…

వడ్డీరేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, ద్రవ్యోల్బణం పైనే దృష్టి

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్కు వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా పెంచడంద్వారా దేశంలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్ధాయిలో ఉన్న విషయాన్ని తెలియజెప్పింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించడమే తన ద్రవ్యవిధానం ప్రధాన కర్తవ్యమని చాటి చెప్పింది. ప్రతి సంవత్సరం ద్రవ్యవిధానాన్ని అర్.బి.ఐ నాలుగు సార్లు సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి కావడానికి అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు కూడా సమీక్షించడానికి ఆర్.బి.ఐ గత సంవత్సరం నిర్ణయించింది. తాజాగా మంగళవారం…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…

హాంకాంగ్‌లో మొట్టమొదటి సారిగా “కనీస వేతన చట్టం”

హాంకాంగ్‌లో మొదటిసారిగా కనీస వేతన చట్టం ప్రవేశపెట్టారు. 125 వ అంతర్జాతీయ కార్మిక దీక్షా దినోత్సవం రోజున హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌ను 1997 లో బ్రిటిష్ చేతినుండి చైనా ఆధీనంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య బ్రిటన్ పాలనలో శ్రమ చేసే ప్రజలకు కనీస వేతన చట్టం లేకపోవడంతోటే బ్రిటన్‌కి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవం తెలుపుతోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలని ఈ బ్రిటన్ లాంటి దేశాలు చైనాను డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో,…

గడ్డాఫీని చంపడం చట్టబద్ధమేనట! అందుకు లిబియన్లు కోపగించుకుంటే చట్ట విరుద్ధమట!!

గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. బ్రిటన్ లోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…