జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు

తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది. సంఘటనల క్రమం ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు…

విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు

గురువారం “మిలియన్ మార్చ్” సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చివేశారని డిజిపి ప్రకటించడం సరికాదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఓ విలేఖరితో మాట్లాడుతూ ఖండించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా డిజిపి ప్రకటన జారీ చేయడం తగదని ఐ.ఎఫ్.టి.యు జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ హైద్రాబాద్ లో ఈటివితో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. టాంక్ బండ్ ప్రదర్శనలో అన్ని పార్టీలు, సంఘాల వారు పాల్గొన్నారనీ, పైగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు ప్రతిజ్గ్న చేసిన వెంటనే తిరిగి వచ్చారు తప్ప…

విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం

ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…

కందుకూరు పట్టణంలో పి.డి.ఎస్.యు విద్యార్ధుల ధర్నా -ఫొటో

పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘం ప్రకాశం జిల్లా శాఖ 2010 జులై నెలలో హైస్కూల్  విద్యార్ధుల సమస్యలపై ఆందోళన నిర్వహించింది. కందుకూరు పట్టణంలోని హైస్కూల్ భవనం కూలిపోయే దశలో ఉంది. క్లాస్ రూమ్ లు చాలావాటికి పై కప్పులు లేవు. పెంకులతో నిర్మించిన పైకప్పు కొన్ని క్లాసుల్లో ఏ క్షణంలోనైనా కూలిపోయేటట్లు ఉన్నాయి. స్కూల భవనానికి మరమ్మతులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్ధులు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అప్పటి…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్స్

యూరోపియన్ పార్లమెంటు లిబియాలోని తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఫ్రాన్సు మొదటిసారిగా అందుకు అనుగుణమైన చర్యను తీసుకొంది. లిబియా తూర్పు ప్రాంతంలోని బెంఘాజీ పట్టణం కేంద్రంగా ఏర్పడిన “లిబియా జాతీయ కౌన్సిల్” ను అధికారిక స్టేట్ బాడీగా ఫ్రాన్సు గుర్తించింది. యూరోపియన్ పార్లమెంటు దేశాల ప్రభుత్వాలను కాకుండా రాజ్యాన్ని గుర్తిస్తాయి. అందువలన అది తన సభ్య దేశాలను తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందిగా కోరింది. తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కౌన్సిల్ తో సంబంధాలు…

మిలియన్ మార్చ్ లో అపశృతులు, పోలీసులూ, ప్రభుత్వానిదే బాధ్యత

తెలంగాణ వాదులు గురువారం, మార్చి 10 తేదీన తలపెట్టిన “మిలియన్ మార్చ్” విజయవంతం అయిందని తెలంగాణ జెఏసి ప్రకటించింది. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అయితే కార్యకర్తలు టాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోకపోయినట్లయితే ప్రశాంతంగా జరిగి ఉండేదని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. జెఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు జెఏసి ఆఫీసు…

తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…

అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం

  అమెరికాలో విస్ కాన్సిన్ రాష్ట్రంలో ఈజిప్టు తరహాలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు మొదలయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మూడు వారాలనుండీ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అక్కడ ఏమీ జరగనట్లుగా నాల్రోజుల క్రితం వరకూ నటిస్తూ వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రత్యక్షంగా కారణమైన అమెరికాలోని ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలపై చర్య తీసుకోవటం అటుంచి ‘స్టిములస్ ప్యాకేజీ’ పేరుతో రెండు ట్రిలియన్లకు పైగా ప్రజల సొమ్మును వాటికి ధారపోసిన సంగతి…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…

లిబియాలో కొనసా…గుతున్న అంతర్యుద్ధం

  లిబియాలో తిరుగుబాటుదారులకు గడ్డాఫీ బలగాలకు మధ్య యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరే స్ధితి కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య పట్టణాలు చిక్కుతూ, జారుతూ ఉన్నాయి. మూడు లక్షల జనాభా గల మిస్రాటా పట్టణం దగ్గర భీకర పోరు నడుస్తోంది. “బిన్ జావాద్” పట్టణం ఆదివారం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండగా సోమవారం అది గడ్డాఫీ బలగాల ఆధీనంలోకి వచ్చింది. తిరుగుబాటుదారులు చేతిలో ఉన్న మరో పట్టణం స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. గడ్డాఫీ బలగాలకు యుద్ధ…

ఇండియా ప్రధానికి బ్రిటన్ ప్రధాని వాణిజ్య పాఠాలు

  బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ భారత దేశ ప్రధాన మంత్రికి విదేశీ వాణిజ్యం, దానికి సంబంధించిన విధాన నిర్ణయాలపై పాఠాలు నేర్పటానికి పూనుకున్నాడు. ఇద్దరి మధ్య వేలకొద్దీ కిలోమీటర్ల దూరం ఉండడంతో కరెస్పాండెన్స్ కోర్సును కామెరూన్ పాఠాలు చెప్పడానికి ఎన్నుకున్నాడు. బ్రిటన్, ఇండియా లకు చెందిన కంపెనీల మధ్య ఇండియాలో ఉన్న “కైర్న్ ఇండియా” కంపెనీ అమ్మటానికి ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వ రంగ సంస్ధకు వాటాలుండడంతో ఇక్కడి ప్రభుత్వ అనుమతి…

లిబియా అంతర్యుద్ధం – లిబియా ఆయిల్ కోసం అమెరికా, ఐరోపా కుతంత్రాలు

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ప్రజా ఉద్యమాలు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో  లిబియా ప్రజలు 41 సంవత్సరాల నుండి ఏలుతున్న గడ్డాఫీని వదిలించుకోవడానికి నడుం బిగించారు. ఫిబ్రవరి 16 న లిబియాలోని రెండో పెద్ద పట్టణం బెంఘాజీ నుండి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంఘాజీని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు కొద్దిరోజుల్లోనే లిబియా తూర్పుప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ట్రిపోలిలో…