భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…

బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది. బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు. ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు…

తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు

ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం. తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న…

రెండో అణు రియాక్టర్ పేలుడు, అణు ప్రమాదం అంచున జపాన్

8.9 పాయింట్ల భూకంపం, ఆ తర్వాత ఏళ్ళూ, ఊళ్ళూ ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడిన సునామీ, అటు పిమ్మట ఫుకుషిమా దాయీచి నెం.1 అణు రియాక్టర్ పేలుడు, ఇప్పుడు దాయీచి నెం.3 అణు రియాక్టర్ పేలుడు… ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతున్న కష్టాలతో జపాన్ ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో మునిగి ఉన్నారు. ఒకదాని నుండి తేరుకునే లోగానే మరొక కష్టం విరుచుకు పడుతోంది. నెం.1, నెం.3 అణు రియాక్టర్లు ఇప్పటికే పేలిపోగా నెం.2 రియాక్టర్లో నీటి…

వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం…

గడ్డాఫీ స్వాధీనంలో రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’

గడ్డాఫీ బలగాలు రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ను వశం చేసుకున్న గడ్డాఫీ బలగాలు సాయంత్రానికి ‘బ్రెగా’ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు బలగాలు తమ కేంద్ర పట్టణమయిన ‘బెంఘాజీ’ కి ముఖద్వారమైన ‘అజ్దాబియా’ పట్టణానికి తిరుగుటపా కట్టారు. అజ్దాబియా కూడా గడ్డాఫీ స్వాధీనం చేసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల వశంలో ఉన్న తూర్పు ప్రాంతంపై కూడా గడ్డాఫీ బలగాలు దాడి చేయవచ్చు. సాయుధ గ్యాంగులను…

టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం

మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగుజాతి మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావడం నిస్సందేహంగా ఖండనార్హమే. కానీ ఏనాడూ ప్రజల ఈతి బాధల గురించి కించిత్ ఆందోళన సైతం ప్రకటించనివారు, వేలకొద్దీ జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఎన్నడూ స్పందించనివారు, సోంపల్లి, కాకరాపల్లి ప్రజల కూడు, గూడు నాశనం చేయడమేకాక అదేమని అడిగినందుకు కాల్చి చంపడం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్యాదకు కూడా ప్రశ్నించని వారు ఈ నాడు మేధావులమంటూ విగ్రహాల ధ్వంసంపై ధర్మాగ్రహం ప్రకటించడం ఏ కోవలోకి వస్తుందో…

లిబియా నిషిద్ధ గగనతలానికి అరబ్ లీగ్ ఆమోదం, గడ్డాఫీ బలగాల పురోగమనం

లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో…

జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…

యెమెన్ నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఆరుగురు మృతి

ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై  మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు…

పెళ్ళి మాటున జన సమీకరణ, మిలియన్ మార్చ్ కోసం న్యూడెమొక్రసీ ఎత్తుగడ

మిలియన్ మార్చ్ కోసం పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. “ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడుతుందనే మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు తప్ప వేరేదానికి కాదు” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మార్చ్ అనంతరం ప్రకటించిన విషయం వార్తా ఛానెళ్ళలో ప్రసారం కావడం కూడా అందరూ చూశారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం మేరకే పోలీసులు తెలంగాణ అంతటా ఎవరూ హైద్రాబాద్ కు రాకుండా నిర్బంధించారనేది అర్ధం అవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం…

తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…

జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…

తెలుగునాట మరో కుటుంబ పార్టీ ఆవిర్భావం

పార్టీ పేరు: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఆవిర్భవింప జేసినవారు: వై.ఎస్.ఆర్ తనయుడు పార్టీ జెండాను ఆవిష్కరించినవారు: వై.ఎస్.ఆర్ సతీమణి విజయమ్మ పార్టీలోని ముఖ్య నాయకులు: వై.ఎస్.ఆర్ ద్వారా పదవులు పొందినవారు పార్టీ జెండాపై ఉన్నది: వై.ఎస్.ఆర్ బొమ్మ ఇదీ క్లుప్తంగా తెలుగునాట కొత్తగా ఆవిష్కృతమయిన రాజకీయ పార్టీ ప్రొఫైల్. ఇప్పటి వరకూ భారతదేశంలో పుట్టిన పార్టీలన్నీ తమ జెండాపై దేశ సంస్కృతికి సంబంధించిన గుర్తుగానీ, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించిన గుర్తుగానీ, దేశ చరిత్రను…

గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు

గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి. పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు…