‘నందిగ్రాం హింస’తో అమెరికాలో శిక్షణార్హత కోల్ఫోయిన ఐ.పి.ఎస్ అధికారి -వికీలీక్స్

తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై…

మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…

లిబియా – ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు పశ్చిమ దేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…

లిబియా పౌరుల రక్షణకై చేసే దాడుల్లో పౌరులే చనిపోతున్నారు -అరబ్ లీగ్

అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అమీర్ మౌసా లిబియాపై పశ్చిమ దేశాల దాడులు తీవ్ర స్ధాయిలో ఉండడాన్ని ఆదివారం విమర్శించాడు. లిబియా పౌరులను గడ్డాఫీ విమానాల దాడులనుండి రక్షించడకోసం భద్రతా సమితి అనుమతి ఇచ్చింది తప్ప వారిని చంపడానికి కాదన్నాడు. లిబియాలో జరుగుతున్నది లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఉన్నదని విమర్శించాడు. పౌరుల రక్షణనే మేం కోరాం తప్ప మరింతమంది పౌరులపై దాడులు చేయడం కాదన్నాడు. ఆదివారం పశ్చిమ దేశాలను విమర్శించిన అమిర్…

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి వ్యతిరేకత ఉత్తుత్తిదే -అద్వానీ (వికీలీక్స్)

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు…

అమెరికా విషయంలో బిజెపి ది రెండు నాల్కల ధోరణి -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి చేసిన తీవ్ర విమర్శలు నిజానికి అంత తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజేపి నాయకులే చెప్పిన సంగతిని అమెరికా రాయబారి కేబుల్ ద్వారా బయట పడింది. బిజేపి ది రెండు నాల్కల ధోరణి అనీ అమెరికాతో ఒప్పందాలపై బిజేపి ప్రకటించే వ్యతిరేకత అధికారం కోసమే తప్ప అందులో నిజం లేదని భారత దేశంలో ఎం.ఎల్ పార్టీలు చెప్పడం వాస్తవమేనని వికీలీక్స్ లీక్ చేసిన అమెరికా రాయబారుల కేబుళ్ళ ద్వారా ఇప్పుడు…

పశ్చిమ దేశాల దాడులకు ఊతమిచ్చిన గడ్డాఫీ చర్యలు

ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లకు ఇప్పుడు మరో దేశం జత కలిసింది. అమెరికాతో పాటు ఐరోపాలలోని పెత్తందారీ దేశాలు మరో బాధిత దేశాన్ని తమ ఖాతాలో చేర్చుకున్నాయి. శనివారం లిబియాపై ఫ్రాన్సు జరిపిన విమానదాడులతో ప్రారంభమైన పశ్చిమ దేశాల కండకావరం ఆదివారం అమెరికా, బ్రిటన్ ల క్షిపణి దాడులతో మరింత పదునెక్కింది. ప్రత్యక్షంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాల్ దేశాల ప్రజలు కష్టాల సుడిగుండం లోకి నెట్టడంతో పాటు పరోక్షంగా తమ దేశాల ప్రజలను కూడా ఆర్ధిక, సామాజిక సంక్షోభం లోకి…

లిబియాపై అమెరికా, ఐరోపా దేశాల క్షిపణి దాడులు, పౌరుల మరణం

లిబియా పౌరులను గడ్డాఫీ నుండి రక్షించే పెరుతో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాలోని తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణం ‘బెంఘాజీ’ పై మిస్సైళ్ళతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో లిబియా పౌరులు మరణించినట్లు తెలుస్తున్నది. మరో వైపు గడ్డాఫీ పశ్చిమ దేశాలతో దీర్ఘకాలిక యుద్ధం సాగిస్తానని ప్రతిన బూనాడు. ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి చేత దాడులకు అనుకూలంగా తీర్మానం చేయించుకుని, ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి దాడులు చేస్తున్నామని పశ్చిమ దేశాలు చెప్పడంలో…

వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవే -రాయబారి మల్ఫోర్డ్

అమెరికా రాయబారులు రాసినవంటూ వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ లోని సమాచారాన్ని నమ్మలేమని పార్లమెంటులో ప్రకటించిన భారత ప్రధాని కి సమాధానం దొరికింది. అసలు వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ అసలు ఉన్నాయా లేదో కూడా రుజువులు లేవన్న మన్మోహన్ అనుమానానికి కూడా సమాధానం దొరికింది. సమాధానం ఇచ్చిన వారు ఎవరో కాదు. 2004 నుండి 2009 ఫిబ్రవరి వరకూ ఇండియాలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇండియా పై తాను సేకరించిన సమాచారాన్ని కేబుల్స్ గా పంపిన డేవిడ్ సి.…

ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ,…

వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని…

శనివారం జపాన్ అణువిద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

భూకంపం, సునామీల దెబ్బకు పేలిపోయి అణు ధార్మికత వెదజల్లుతూ ప్రమాదకరంగా పరిణమించిన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లకు శనివారం విద్యుత్ పునరుద్ధరించగలమని జపాన్ తెలిపింది. భూకంపం సునామీల వలన రియాక్టర్లకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్ధ పని చేయడం మానివేసింది. దానితో రియాక్టర్లలోని ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయే పరిస్ధితి తలెత్తింది. వాటిని చల్లబరచడానికి జపాన్ రెండు రోజులనుండి వాటర్ కెనాన్ ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని…