‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 1

శ్రీశ్రీ గారి మహా ప్రస్ధానం రచనకు గుడిపాటి చలం ముందుమాట రాశారు. అందులో ఆయన “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ కి బాధ” అని చమత్కరించారు. అది చమత్కారమే అయినా వాస్తవం కూడా ఉంది, అది వేరే సంగతి. అమెరికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాకి ఏ భాధ వచ్చినా దాన్ని ప్రపంచానికి అంటగడుతుంది. ఎయిడ్స్ జబ్బుని అలాగే అంటగట్టింది. “టెర్రరిజం పై సమరా”న్ని కూడా అలాగే అంటగట్టింది. తాజాగా ఆర్ధిక…

యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

  భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర…

సంకీర్ణ సేనల దాడుల సాయంతో కీలక పట్టణం తిరుగుబాటుదారుల స్వాధీనం

పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న…

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి, ఆగ్రహించిన అమెరికా రాయబారి -వికీలీక్స్

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు తొ జరిగిన విషయం తెలిసిందే. జులై 2005 లో జరిగిన ఈ వివాహం రిసెప్షన్ జులై 23, 2005 తేదీన దుబాయ్ లోని హోటల్ హయత్ లో జరిగింది. ఈ హోటల్ యజమాని అమెరికాకి చెందిన హయత్ కార్పొరేషన్ కావడమే అమెరికా రాయబారి ఆగ్రహానికి కారణం. దుబాయ్ లోని హోటల్ హయత్ అమెరికాకి చెందిన హోటల్ అని భారత దేశంలో అందరికీ తెలుసనీ,…

లిబియా దాడులతో స్పష్టమైన అమెరికా బలహీనత -న్యూ డెమొక్రసీ నాయకుడు

లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ,…

రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల్లో చిక్కుకున్న పోర్చుగల్, యూరప్ ని వెంటాడుతున్న అప్పు సంక్షోభం

గ్రీసు, ఐర్లండ్ లను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం ఇప్పుడు పోర్చుగల్ ని బలి కోరుతోంది. ఆర్ధిక సంక్షోభం పేరుతో పోర్చుగల్ ప్రధాని జోస్ సోక్రటీసు బడ్జెట్ లో ప్రతిపాదించిన కఠినమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓటువేయడంతో సోక్రటీసు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటీసు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్నాడు. బ్రసెల్స్ లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సభ యూరోపియన్…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…

తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయాన్ని అడ్డుకోవడానికే రహస్య నోట్ -జస్టిస్ నరసింహారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడానికే రహస్య నోట్ గా ప్రస్తావించిన 8 వ ఛాప్టర్ ను తమ నివేదికలో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పొందుపరిచిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. శ్రీ కృష్ణ కమిటీ తాను సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ నరసింహా రెడ్డి బుధవారం తుది తీర్పును వెలువరించిన…

పోర్చుగీసు అప్పు సంక్షోభం నేపధ్యంలో ఇ.యు శిఖరాగ్ర సమావేశం

బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో గురువారం జరగనున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో పోర్చుగీసు అప్పు సంక్షోభం పైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్యునీషియా, ఈజిప్టు పరిణామాలు ఎజెండా గా సమావేశం ఏర్పాడు చేసినప్పటికీ పోర్చుగీసు లో ప్రభుత్వ సంక్షోభం ముంచుకు రావడంతో సమావేశంలో ఆ అంశమే మిగతా అంశాలను పక్కకు నెట్టే పరిస్ధితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పోర్చుగీసు ప్రభుత్వం బడ్జేట్ లో తలపేట్టిన నాల్గవ విడత పొదుపు చర్యలను సమర్ధించడానికి ప్రతిపక్షాలు…

జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…

కూలిపోయే దిశలో పోర్చుగల్ ప్రభుత్వం

యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ జడలు విప్పుతోంది. తాజాగా అది పోర్చుగల్ ను బలి కోరుతోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు), ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ తీసుకోవడానికి వ్యతిరేస్తున్న సోషలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన పొదుపు చర్యలను పార్లమెంటు వ్యతిరేస్తుండడంతో పోర్చుగల్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గురువారం జరగనున్న ఇ.యు సమావేశం నాటికి పొదుపు చర్యల బిల్లును ఆమోదించుకుని వెళ్ళాలన్న ప్రధాన మంత్రి “జోస్ సోక్రటీస్” ఆశల్ని వమ్ము చేస్తూ, సోషల్ డెమొక్రట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నది. “బిల్లు…

కాంగ్రెస్ లో కలిసిపోయే టి.ఆర్.ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించవచ్చా?

కాంగ్రెస్ పార్టీలో టి.ఆర్.ఎస్ ని కలిపేస్తే తప్ప “తెలంగాణ రాష్ట్రం” ఇవ్వబోమని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధి అన్నట్లు కే.సి.ఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కే.సి.ఆర్ దాన్ని అవాస్తవమని కొట్టిపారేసినా, ఆయన ఎం.ఎస్.ఓ ల సంఘం సమావేశంలో ఈ విషయాన్ని చెప్పినట్లు వార్తా ఛానెళ్ళు మంగళవారం అంతా ప్రసారం చేశాయి. ఒక సంఘం సమావేశంలో చెప్పాడంటున్న వార్తను అంత తేలిగ్గా కొట్టేయలేము. అదీకాక కే.సి.ఆర్ కి ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం మామూలే. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…