ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…

11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు

  బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ…

ట్యునీషియా ఆపద్ధర్మ అధ్యక్షునికి మరిన్ని అధికారాలు

ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు. మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు  ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు…

ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం

అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…

శతృవుల పుకార్లతో మా కంపెనీల షేర్లు పడిపోతున్నాయ్ -అనీల్ అంబానీ

మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.   కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో…

మన్మోహన్ ప్రభుత్వ ఖాతాలో మరో భారీ కుంభకోణం

గత నాలుగు సంవత్సరాలుగా అనేక చిన్నా పెద్దా కుంభకోణాలతో యమ బిజీగా ఉన్న మన్మోహన్ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెర లేపి రెడ్ హేండెడ్ గా దొరికిపోయింది. ఈసారి చాలా ముందుగానే బయట పడటంతో దేశ ఖజానా మీదనే కన్నేసిన ఓ భారీ బందిపోటు దోపిడీ తప్పిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) వాణిజ్య విభాగంమైన ఆంత్రిక్స్ సంస్ధ బెంగుళూరు కేంద్రంగా గల ఒక ప్రైవేటు కంపెనీకి అరుదైన ఎస్-బ్యాండు స్పెక్ట్రంలో కొంత భాగాన్ని…

అమెరికా సెక్యూరిటీ సంస్ధ హెచ్.బి.గ్యారీపై ఎనోనిమస్ హ్యాకర్ల దాడి

ఎనోనిమస్ హ్యాకర్లు మరోసారి తమ ప్రతాపం చూపారు. ఇంటర్నెట్ లో తన కార్యకలాపాలను నిర్వహించే ఈ గ్రూపు సభ్యులు తాజాగా అమెరికా సెక్యూరిటీ సంస్ధ ” హెచ్.బి.గ్యారీ ఫెడరల్ “ వెబ్ సైట్లపై తమ ప్రతాపం చూపారు. ఆ సంస్ధ ఉన్నతాధికారుల్లో ఒకరైన ఏరన్ బార్, తాము ఎనోనిమస్ సభ్యుల్లో సీనియర్లను గుర్తించామని గత వారాంతం ప్రకటించటమే వీరి దాడికి కారణంగా తులుస్తోంది. ఎనోనిమస్ సంస్ధలో ప్రపంచ వ్యాపితమ్గా వేలమంది కంప్యూటర్ నిపుణులు సభ్యులుగా ఉన్నారని వివిధ…

నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ

“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…

జులియన్ అస్సాంజ్ అప్పగింత కేసులో వాదనలు ప్రారంభం

లైంగిక అత్యాచారం కేసులో జులియన్ ను ఇంగ్లండ్ నుండి స్వీడన్ కు అప్పగించాలంటూ స్వీడన్ పోలీసులు బనాయించిన కేసులో వాదనలు సోమవారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యాయి. జులియన్ లాయర్లు రెండు ప్రధాన అంశాల మీద ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి సాంకేతిక కారణాలు కాగా రెండోది మానవ హక్కుల ఉల్లంఘన. స్వీడన్ పోలీసులు ఇంతవరకు జులియన్ పైన ఛార్జ్ ఏ నేరమూ మోపలేదు. లైంగిక అత్యాచారం ఆరోపణలపై అతనిని ప్రశ్నించటానికి మాత్రమే తమకు అప్పంగించాలని స్వీడన్ పోలీసులుకోరుతున్నారు.…

ట్యునీషియా పోలీసుల కాల్పుల్లో ఇద్ధరు పౌరుల మృతి

ట్యునీషియాలో పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. వాయవ్య ప్రాంతంలో ఉన్న కెఫ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల పెత్తనానికి వ్యతిరేకంగా స్ధానికులు పోలీసు స్టేషన్ ముందు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడి పోలీస్ చీఫ్ నిరసనకారులలోని ఒక మహిళను చెంపపై కొట్టాటంతో పరిస్ధితి విషమించినట్లు బి.బి.సి తెలిపింది. మహిళపై చేయి చేసుకున్నాక ప్రజలు కోపంతో స్టేషన్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరటంతో పోలీసులు కాల్పులు…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…

కొత్త రాజధాని కోసం దక్షిణ సూడాన్ వెతుకులాట

త్వరలో కొత్త దేశంగా ప్రపంచ దేశాల జాబితాలో చేరనున్న దక్షిణ సూడాన్ కొత్త రాజధాని కోసం వెతుకులాటలో పడింది. 2005 లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం దక్షిణ్ సూడాన్ ప్రజలు తమ భవిష్యత్ గురించి తామె నిర్ణయంచుకోవటం కోసం జనవరి 9 నుండి  15 వరకు జరిగిన రెఫరండంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాధమిక ఫలితాల ప్రకారం దాదాపు 99 శాతం మంది స్వతంత్రం దేశం కోసమే మొగ్గు చూపడంతో మరొక కొత్త దేశం ఏర్పాటు…

“డే ఆఫ్ డిపార్చర్” పాటిస్తున్న ఈజిప్టు జనం, తెర వెనుక అమెరికా బిజీ

ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ…

షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు, ద్రవ్యోల్బణం సాకుతో రిటైల్ రంగం ప్రైవైటీకరణ

శుక్రవారం షేర్ మార్కెట్ బారీగా నష్తపోయింది. బోంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) 441 పాయింట్లు కోల్పోయి 18008 వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్.ఎస్.ఇ లేదా నిఫ్టీ) 131 పాయింట్లు కోల్పోయి 5395 దగ్గర క్లోసయ్యింది. ఈజిప్టు ప్రజాందోళనలతో ఆయిలు ధర కొండెక్కడం ఖాయం అన్న ఆందోళన పెరగడం, దానివలన నిత్యావసరాల ధరలు కూడా పేరిగి పోతాయన్న భయాలతో దేశీయ మదుపరులు స్టాక్ మార్కెట్ జోలికే రాక పోవటం, ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకొవటం…