బడ్జెట్ 2015-16: వృధా పధకాలకు బోలెడు నిధులు -(3)

మోడి అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ ప్రధానంగా ప్రజలను ఏదో ఒక విధంగా బిజీగా ఉంచడానికి ఉద్దేశించిన గాలి కబుర్ల పధకం. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పధకం. ఆం ఆద్మీ పార్టీ గుర్తు చీపురును ఆ పార్టీ నుండి లాక్కొని తమ స్వంతం చేసుకునేందుకు మోడి వేసిన ఎత్తుగడ. ఆయన ఎత్తుగడ విఫలం అయింది. తాము అమలు చేసే ప్రజా వ్యతిరేక సంస్కరణలనుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించి మరింతగా పొడిగించారు. ప్రభుత్వ…