అమెరికా-తాలిబాన్ చర్చలు, కర్జాయ్ అలక

సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని…

నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్

కేశవ్ నుండి మరో అద్భుతమైన, నిశితమైన, శక్తివంతమైన కార్టూన్! మోడి నియంతృత్వ పోకడలు ఇతర పార్టీలే కాకుండా బి.జె.పి నాయకులు కూడా అనేకమంది విమర్శిస్తారు. తన ప్రధాని కలకు అడ్డువచ్చిందుకు ఎల్.కె.అద్వానీ మోడి సహిత బి.జె.పి పైన చేసిన విషయం ఇంకా పత్రికల్లో నానుతోంది. గోధ్రా అనంతర అల్లర్లను ఆపకుండా రాజధర్మ నిర్వహణలో విఫలమైనందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సైతం మోడీని విమర్శించారు. పరమత విద్వేష పూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ తొగాడియా (విశ్వ…

అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…