ప్రకృతి ఒక్క కసురు కసిరితే చాలు… విలయమే ఇక!

మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది. గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక…

రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

పన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది.…

బి.జె.పి – మోడి డామినేషన్ -కార్టూన్

నరేంద్ర మోడిని బి.జె.పి కేంద్ర పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుని రెండు నెలలు కూడా కాలేదు. ఆయనని బోర్డు సభ్యుడుగా తీసుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే ఇతర సభ్యులను డామినేట్ చేశారు. మీడియాని ఎలా ఆకర్షించాలో మోడీకి కరతలామలకమే. పార్లమెంటరీ బోర్డు సమావేశాలపై కేంద్రీకరించడం మాని విలేఖరులు మోడి చుట్టూ తిరగడం, ఆయన వెంట పరుగులు పెట్టడం చేశారు. బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీలోని బి.జె.పి నాయకులను ఒక్కొక్కరినీ స్వయంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం ద్వారా మోడి ఈ…