కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

రెక్కలు కట్టుకుంటే మాత్రం ఎగరగలమా? -కార్టూన్

రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం. భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని…

ప్రత్యేకతలే కొండగుర్తులు -ఈనాడు ఆర్టికల్ 12వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో చివరి భాగం ఈ రోజు ఈనాడు దినపత్రికలో చదువు పేజీలో వచ్చింది. “ప్రత్యేకతలే కొండగుర్తులు” శీర్షికన వచ్చిన ఈ భాగం, మరిన్ని దేశాల ప్రత్యేకతలను వివరిస్తూ వాటి ఆధారంగా వివిధ దేశాలను ఎలా గుర్తు పెట్టుకోవచ్చునో చర్చించింది. ఈ భాగాన్ని నేరుగా ఈనాడు వెబ్ ఎడిషన్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. కింద బొమ్మను క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. బొమ్మ…

చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!

యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది. ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని…