సి.బి.ఐని కడిగేసిన సుప్రీం కోర్టు
– బొగ్గు కుంభకోణం విచారణలో సి.బి.ఐ నిర్వహిస్తున్న పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. సి.బి.ఐ ని ప్రభావితం చేయడానికి న్యాయ శాఖ మంత్రి స్వయంగా పూనుకోవడం, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఇందులో పాత్ర వహించడాన్ని బట్టి పాలకులు అవసరం అయితే ఎంతకు తెగిస్తారో తెలిసి వస్తోంది. విచారణ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి చూపడం లేదని మార్చి 8 తేదీన చెప్పిన సి.బి.ఐ ఏప్రిల్ 26 తేదీన సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వానికి చూపిన తర్వాతే కోర్టుకు…


