అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం. భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ…

విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.…

ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

విమర్శల రాయి విసురు, నిధుల పండ్లు రాలు -కార్టూన్

రాజకీయాలు పెద్దోళ్లు-పెద్దోళ్లు ఆడుకోవడానికే గానీ జనాల అవసరాలు తీర్చడానికా? ఎన్నికల మేనిఫెస్టోలు, నాయకుల ప్రసంగాలు, పార్టీల రాజ్యాంగాలు ఇవన్నీ జనం పేరు చెప్పకుండా ఒక్క వాక్యాన్నీ ముగించలేవు. అదే చేతల్లోకి వస్తే జేబులోకి (ఆదేలెండి, ఖాతాలోకి) కాసు రాలకుండా ఒక్క అడుగూ ముందుకు పడదు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల సాగించిన బురద రాజకీయం ఆ సంగతే చెబుతోంది. రెండు రోజుల పాటు ములాయం సింగ్ కాంగ్రెస్ పైన నోటితో నిప్పులు విరజిమ్మాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్నాడు.…

వావ్… ఫొటోలు, పోటీ కోసం!

స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ నిర్వహించే పోటీ కోసం ఎంపికైన టాప్ 50 ఫొటోల్లో ఇవి కొన్ని. 112 దేశాల నుండి 37,600 ఫొటోలు పోటీ కోసం వచ్చాయట. అందులో 50 ఫొటోలను షార్ట్ లిస్ట్ చేసింది మ్యాగజైన్. ఇంకా చివరి ఫలితాలు వెల్లడి కాలేదట. ఐదు విభాగాల్లో విజేతలు నిర్ణయించి బహుమానం ఇవ్వనున్నారు. పోటీ ఈ రోజు, అంటే మార్చి 29 తో ముగుస్తోంది. ‘రీడర్స్ ఛాయిస్‘ విజేత కోసం ఈ ఫొటోలను స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ తన వెబ్…

ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account Deficit –CAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్)…

ఐ.పి.ఎల్: పిచ్ చూసి చెబుతాం… ఎవరు ఆడతారో -కార్టూన్

పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా. లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్…

సూర్యనెల్లి అత్యాచారం: రాజ్యసభ ఉపాధ్యక్షుడికి తాజా నోటీసులు

సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసు రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ను వదలకుండా వెంటాడుతోంది. బాధితురాలి పట్టు విడవని ప్రయత్నాలు కేరళ కాంగ్రెస్ నాయకుడికి రాజకీయంగా చివరి రోజులు ఖాయం చేసినట్లు కనిపిస్తోంది. తన పైన అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన పి.జె.కురియన్ పైన పునర్విచారణ చేయాలని మార్చి నెల ఆరంభంలో బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ ను పెరుమాదె జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 2 తేదీన కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా…

బ్రిక్స్ పీఠంపై బాహాబాహి, జపాన్ వాకిట భిక్షాందేహి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల…

ములాయంజీ! ఆకాశానికి నిచ్చెన నిలిచేనా? -కార్టూన్

బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…

ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం

ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‘ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక  దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.…