తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…

చచ్చిపోయిన రిపోర్టర్ –‘ది హిందూ’ సంచలనాత్మక కధనం

(ఇది సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం. బడా కార్పొరెట్ కంపెనీలు మీడియాను కొనెయ్యడం వలన వార్తల సేకరణలో విలేఖరి పాత్ర నామమాత్రం అవుతోందని, సంపాదకుడే యజమానికి నేరుగా ఫ్రంట్ గా వ్యవహరించవలసిన దుర్దినాలు దాపురించాయని ప్రతిభావంతంగా ఇందులో ఆయన వివరించాడు. టి.వి వార్తల సమయాన్ని రియాలిటీ షోలు కబళిస్తున్న వైనం కార్పొరేటీకరణ పుణ్యమేనని అనుభవంతో చెబుతున్న సందీప్ భూషణ్ వివరణ మనకు తెలియని కోణాలనుండి టి.వి కవరేజిని చూసే అవకాశం ఇస్తుంది. ఆంగ్ల వ్యాసానికి…

మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే

మతోన్మాదం గురించి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ చర్చ జరుగుతోంది. మైనారిటీ మతోన్మాదం వార్తలకు ఎక్కడం ఈసారి ప్రత్యేకత. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ చోట్ల ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగాలు ఈ చర్చకు ప్రేరణగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూ తీవ్రవాద సంస్థలు, పార్టీల నుండి సెక్యులరిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ నుండి వివిధ సెక్యులర్ ముస్లిం సంస్థల వరకూ…

తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్

ఒకరు అరే అంటే మరొకరు ఏరా అంటారు. ఒకరు తొడగొడితే మరొకరు మీసం మెలివేస్తారు. ఒకరు పౌర విమానం పంపితే మరొకరు ఏకంగా జెట్ ఫైటర్ విమానాన్నే పంపుతారు. తూర్పు చైనా సముద్రంలో చైనా, జపాన్ లు మళ్ళీ కీచులాటలు మొదలు పెట్టాయి. కీచులాటలు కాస్తా యుద్ధం వైపుకి దారి తీస్తాయేమోనని ఉగ్గబట్టుకోవడం ఇరుగు పొరుగు దేశాల పనిగా మారుతోంది. నివాస యోగ్యం కాని చిన్న చిన్న దీవుల పైన ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలను…

లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ‘ది హిందూ‘ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు దుర్మరణం చెందారు. పోలీసులు మరణించిన తమ సహచరుడి శవానికి ఇరవై అడుగుల దూరంలోనే నిలబడి శవాన్ని తేవడానికి గిరిజనులను పంపించడంతో పేలుడునుండి పోలీసులు తప్పించుకోగా గిరిజనులు చనిపోయారు. శవాన్ని తన భుజానికి ఎత్తుకుంటూ శవం…

ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…

ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటే తప్ప పోలీసులు, ప్రభుత్వం కదల్లేదు

“డిసెంబర్ 26 తేదీ సాయంత్రం, న్యూ ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు భారత ప్రభుత్వ జెట్ విమానంలో మెరుగైన వైద్యం కోసం సింగపూర్ వెళుతున్న సమయంలోనే మరో సామూహిక అత్యాచార బాధితురాలయిన ఒక టీనేజి అమ్మాయి తన ప్రాణం తాను తీసుకుంటోంది” (రాయిటర్స్, 16.01.2013) పంజాబ్ లో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న 17 సంవత్సరాల బాలిక గురించి రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పిన సంగతి ఇది. దేశం మొత్తం ఢిల్లీ అమానుష కృత్యంపై ఆగ్రహంతో స్పందిస్తూ…

దామిని స్మృతిలో…

దామిని, అమానత్, నిర్భయ పేరేదైతేనేం? ఆమె………………….. హింసోన్మత్త పశు వాంఛలు కాటువేసిన గాయం పెను నిద్దురలోని దేశ అంతరాత్మని తట్టి లేపిన స్పర్శ లాఠీలను గేలి చేసిన నినాదాలకు స్వరపేటిక నీటి ఫిరంగులకు ఎదురొడ్డిన కన్నీటి జలపాతం భారత మహిళ అదృశ్య కారాగార వాసానికి దేదీప్య కాంతుల వెలుగు నిచ్చిన సాహసి! పాలకుల ఉదాసీనత, పాలితుల కర్తవ్యాలు తర్కించి, నిగ్గు దేల్చిన బాధల పాటల పల్లవి! రెండు గంటల్లో వెయ్యి జీవితాల హింసాత్మక దాడిని ఎదుర్కొని, ప్రతిఘటించి,…

పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .…