కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై గురువింద ధాకరే మండిపాటు

చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ…

66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది. “జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన…

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ…