12 మిలియన్ల యాపిల్ డివైజ్ లపై ఎఫ్.బి.ఐ నిఘా, హ్యాకర్ల వెల్లడి

1.2 కోట్ల యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుదారులపై అమెరికా ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ నిఘా పెట్టిన సంగతిని హ్యాకర్లు బట్టబయలు చేశారు. ఎఫ్.బి.ఐ ఉన్నతాధికారికి చెందిన ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో 12,367,232 యాపిల్ డివైజ్ లకు చెందిన యు.డి.ఐ.డి (Unique Device IDentifiers) లను ఎఫ్.బి.ఐ నిలవ చేసిన సంగతిని హ్యాకర్లు వెల్లడి చేశారు. యు.డి.ఐ.డి లు నిజమైనవే అని చెప్పడానికి ఒక మిలియన్ యు.డి.ఐ.డి లను కూడా తమ వెబ్ సైట్…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ 2012 ఫోటో పోటీలు -ఫోటోలు

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…