పవర్ గ్రిడ్ విఫలమై విద్యుత్ సరఫరా ఆగిపోతే… -ఫోటోలు

ఉత్తర భారతంలో నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా ఆగిపోయి జన జీవనం స్తంభించినప్పటి ఫొటోలివి. జులై 30, 31 తేదీల్లో ఉత్తర భారత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో సరఫరా దెబ్బతిని అంధకారం నిండిపోయింది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ సర్వీసులతో పాటు 300 కి పైగా రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జులై…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…