బొగ్గు ‘మరక మంచిదే’ -కార్టూన్

‘లేచి నిలబడదాం. నిలబడి కలబడదాం’ అని పిలుపునిస్తూ, సోనియా సమర శంఖం పూరించింది. ‘ఆత్మ రక్షణ అనవసరం, కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకండి’ అంటూ సోనియా పిలుపిచ్చిందే తడవుగా చిదంబరం, జైస్వాల్, కపిల్ సిబాల్, మన్మోహన్ సింగ్ తదితర హేమా హేమీలంతా తలా ఒక  కత్తి పట్టి దూకనే దూకారు. ‘బొగ్గు తవ్వనే లేదు, ఇక నష్టం ఎక్కడ’ అని చిదంబరం ప్రశ్నించగానే ‘జీరో లాస్’ అననే అన్నాడు అని పత్రికలు రాసేశాయి. ‘అబ్బే జీరో లాస్…

లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

 “విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”     “ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ నాయకులకు స్ధైర్యాన్నివ్వడం కోసం సోనియా గాంధీ అన్న మాటలివి.  బొగ్గు కుంభకోణం వల్ల కేంద్ర ఖజానాకి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడి చేసిన దరిమిలా పార్లమెంటు సమావేశాలను వారం రోజులుగా…