2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

బొగ్గు కుంభకోణం: ప్రధాని నోట ‘జీరో లాస్’ -కార్టూన్

2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తున్నది. అత్యంత కనిష్ట స్ధాయిలో నష్టాన్ని అంచనా వేసినప్పటికీ 1,87,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పిన కాగ్ లెక్కలు వివాదాస్పదమని ప్రధాని వ్యాఖ్యానించాడు. ‘జీరో లాస్’ వాదనకు మద్దతుగా వివిధ అంశాలను…

బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ దోషులేనని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన దోషి అని కనుక దానినే టార్గెట్ చెయ్యాలనీ కిరణ్ బేడీ భావిస్తోంది. లోక్ పాల్ విషయంలో పూర్తిగా కాకపోయినా…