మహబూబ్ నగర్ పల్లెలో ‘ఐ-పలకల’ విప్లవం–ఫోటోలు

కంప్యూటర్ల నుండి మొబైల్ ఫోన్ల వరకూ సమాచార సాంకేతిక విప్లవం మానవ జీవనాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలం మనది. దేశ దేశాల సాంస్కృతిక జీవనంలోకి కూడా చొరబడి మధ్య తరగతి యువతీ, యువకుల చేత కిడ్నీలను అమ్మిస్తున్న ఐ-ఫోన్ల కాలం కూడా మనదే. బిట్లు, బైట్లుగా కాపర్ తీగల్లో ప్రవహిస్తున్న సాంకేతిక విప్లవ ఫలితం భారత దేశ పల్లెలకు అందని ద్రాక్షగా భావించవచ్చు గానీ, మహబూబ్ నగర్ జిల్లా లోని మహమ్మద్ హుసేన్ పల్లి విద్యార్ధులు అందుకు మినహాయింపు…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…