ఫుకుషిమా సముద్ర చేపల్లో భారీ రేడియేషన్
ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద సముద్ర చేపల్లో భారీ స్ధాయి రేడియేషన్ కనుగొన్నట్లు ‘టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ (టెప్కో) తెలిపింది. సముద్ర తీరానికి 20 కి.మీ దూరం లోపల పట్టిన చేపల్లో రికార్డు స్ధాయిలో అణుధార్మిక సీసియం రేడియేషన్ కనుగొన్నామని టెప్కో ప్రకటించిందని ‘ది హిందూ’ తెలిపింది. ప్రమాదానికి గురయిన ఫుకుషిమా అణు రియాక్టర్ల నుండి కలుషిత నీటిని సముద్రంలో కలిపేస్తున్న నేపధ్యంలో ఇటీవలివరకూ ఫుకుషిమా చుట్టు పక్కల చేపలు పట్టడం పై అప్రకటిత నిషేధం…

