‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్

అస్సాంలోని బోడో జిల్లాల్లో చెలరేగిన హింసలో ముస్లిం ప్రజల భద్రతకు హామీ లభించకపోతే ‘ముస్లిం మిలిటెన్సీ’ కి దారి తీయవచ్చని ‘నేషనల్ మైనారిటీస్ కమిషన్’  (ఎన్ ఎం సి) హెచ్చరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీహాదీ సంస్ధల మద్దతుతో అటువంటి మిలిటెన్సీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని కమిషన్ తయారు చేసిన నివేదిక హెచ్చరించింది. ‘బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్క్ట్స్’ (బి.టి.ఎ.డి) కింద ఉన్న నాలుగు జిల్లాలను కమిషన్ సందర్శించిన అనంతరం ఈ నివేదిక తయారు చేసిందని ‘ది…

సుప్రీం కోర్టులో పిటిషన్: తప్పిపోయిన పిల్లలు 55,000

55,000 మందికి పైగా పిల్లలు తప్పిపోయారనీ, వారిని వెతికి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – పిల్) దాఖలయింది. తప్పిపోయిన పిల్లలందరిని వెతకండం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని అడ్వకేట్ సర్వ మిత్ర దాఖలు చేసిన పిటిషన్ కోరింది. “రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో విఫలం అయింది. ఫలితంగా…

ఆపరేషన్ గ్లాడియో: పశ్చిమ దేశాల ముసుగు టెర్రరిజమే గురుద్వారా హత్యాకాండ?

ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త…