సుప్రీం కోర్టు రాజ్యాంగవిరుద్ధ తీర్పు ప్రతిఘటిస్తాం -పాక్ మాజీ ప్రధాని

పాకిస్ధాన్ లో పాలకవర్గాల ఘర్షణ ముదురుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే దానిని ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని గిలానీ ప్రకటించాడు. కోర్టు తీర్పును తిరస్కరించి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్తామని కోర్టుకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు. కొత్త ప్రధాని అష్రాఫ్ ను ప్రధానిగా తొలగించినట్లయితే ప్రజలు ఆందోళన చేస్తారని హెచ్చరించాడు. ఆగస్టు 27 న తనముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాని ‘రాజా పర్వేజ్ అష్రాఫ్’ ను కొద్ది రోజుల…

రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్

భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…