భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…