ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస

ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది. “ప్రపంచ…

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…