పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని…

వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…