ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో చస్తూ చెప్పిన నాలుగు మాటలివి. “అది రేవ్ పార్టీ కాదు. మేమలాంటివారం కాదు. మా ఫ్రెండ్ తన పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంది. ఆడపిల్లల్ని ఇలాగేనా చూసేది? మంగుళూరులో నేనిక ఏ పార్టీకీ వెళ్లను… మా…

‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు

హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన రోజు పార్టీ అని చెబుతున్నప్పటికీ వినకుండా మృగాల్లా ప్రవర్తించారు. అమ్మాయిలను తాకకూడని చోట తాకుతూ, జుట్టు పట్టి లాగుతూ, కొడుతూ నీచంగా ప్రవర్తించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా…

మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన

  (స్త్రీల వస్త్రధారణ వారిపై అత్యాచారాలకు ఒక కారణం అంటూ డి.జి.పి దినేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా బొందలపాటిగారు తన కోణంలో విశ్లేషిస్తూ ఒక టపా డిసెంబర్ 29 తేదీన రాశారు. సదరు టపా కు స్పందనగా మిత్రులు రాజశేఖర్ రాజు గారు చేసిన వ్యాఖ్యానం అద్భుతం. ఆయన చేసిన విశ్లేషణకు మరింత వెలుగు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆయన వ్యాఖ్యలలోని ప్రధాన భాగాన్ని టపాగా మారుస్తున్నాను.  రాజశేఖర్ రాజు, బొందలపాటి గార్ల అనుమతి ఉన్నదని…

ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే

ఆడవాళ్లపై అత్యాచారాలకు, అత్యాచార ప్రయత్నాలకు వారి కురచ దుస్తులే కారణమని పోలీసు బాసులు, ప్రభుత్వాధికారులు నుండి గ్రామ పెద్దల వరకు ఏకబిగిన వాపోతున్న సంగతి తెలిసిందే. ‘ఈవ్ టీజింగ్’ నేరానికి కూడా ఆడపిల్లల డ్రస్సులే ప్రేరణనిస్తున్నాయని తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ధారించాడు. అంతలోనే ఈవ్ టీజింగ్ కొత్తదేమీ కాదని కూడా సమర్ధించుకొచ్చాడు. మరోసారి నాలుక మడతేసి కురచ దుస్తులనూ అభినందించాడు. సొంత పార్టీ మంత్రులతో పాటు ప్రముఖులంతా తూర్పారబట్టినా సంరక్షకుడిగానే తానా మాటలన్నానని తనను తాను…

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…

అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు…

ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస

ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది. “ప్రపంచ…

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…

ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా రానున్న రెండేళ్లలో జర్మనీ AAA రేటింగ్ కోల్పోవచ్చని సంకేతం ఇచ్చింది. ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ గా చేసుకున్న 17 దేశాల యూరో జోన్ కూటమి నుండి గ్రీసు బైటికి వెళ్లిపోతుందన్న అంచనా తో పాటు…

అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం

గత బుధవారం ఒక మానసిక వికలాంగుడికి మరణ శిక్ష అమలు చేసిన అమెరికా ప్రభుత్వం సోమవారం మరో మానసిక రోగికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేయనుంది. ఫ్రాన్సు ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి లతో పాటు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి అమెరికా ససేమిరా అంటోంది. మూడు విడతల మిశ్రమ డోసులో ఇంజెక్షన్స్ ఇచ్చి నెమ్మదిగా ప్రాణం తీసే మామూలు పద్ధతి కాకుండా మొదటిసారిగా ఒకే ఒక్క కొత్త విషం…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…

పెట్టుబడిదారుల అక్రమ డబ్బు రు. 1155 లక్షల కోట్లు

ప్రపంచ దేశాలన్నింటికీ చెందిన ధనికులు దాచిన అక్రమ సొమ్ము విలువ 21 ట్రిలియన్ డాలర్లని ‘టాక్స్ నెట్ వర్క్ జస్టిస్’ (టి.ఎన్.జె) సంస్ధ చెప్పింది. ఈ సొమ్ము 1155 లక్షల కోట్ల రూపాయలకి (1 ట్రిలియన్ = లక్ష కోట్లు, 1 డాలర్ = 55 రూపాయలు) సమానం. ఇది కేవలం కనీస మొత్తం (conservative estimates) మాత్రమే. వాస్తవ మొత్తం 32 ట్రిలియన్ డాలర్లు (రు. 1760 లక్షల కోట్లు) ఉండవచ్చని సదరు సంస్ధ తెలిపింది.…